చరిత్రలో లేని మెజార్టీ కూటమికే దక్కింది: సీఎం చంద్రబాబు…

చరిత్రలో లేని మెజార్టీ కూటమికే దక్కింది: సీఎం చంద్రబాబు

 

గతంలోనూ, ఇప్పుడు కుప్పంలో తాను ప్రారంభించిన కార్యక్రమాలనే ఏపీ వ్యాప్తంగా అమలు చేస్తున్నామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, సంక్షోభాలు వచ్చినా టీడీపీ కాబట్టే నిలదొక్కుకోగలిగిందని పేర్కొన్నారు..

 గతంలోనూ, ఇప్పుడు కుప్పంలో తాను ప్రారంభించిన కార్యక్రమాలనే ఏపీ వ్యాప్తంగా అమలు చేస్తున్నామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandra babu Naidu) వ్యాఖ్యానించారు. కుప్పంలో సీఎం పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కేడర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, సంక్షోభాలు వచ్చినా టీడీపీ కాబట్టే నిలదొక్కుకోగలిగిందని తెలిపారు. చరిత్రలో ఎప్పుడూ రానంత మెజార్టీ కూటమికి, టీడీపీకి వచ్చిందని ప్రస్తావించారు. వైసీపీ ప్రతిపక్ష హోదాకు దరిదాపుల్లోకి కూడా రాలేకపోయిందన్నారు.

అభివృద్ధికి పునాదులు వేసింది టీడీపీనే..

ప్రజలతో ఉంటే ఇలాంటి గెలుపు సాధ్యమవుతుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 2028 నాటికి తన రాజకీయ జీవితం 50 ఏళ్లకు చేరుతుందని చెప్పుకొచ్చారు. అభివృద్ధికి పునాదులు వేసింది.. వేసేది టీడీపీనేనని.. విజన్-2020తో ఇది నిరూపితమైందని వెల్లడించారు. ప్రజల భవిష్యత్, ప్రజల సంక్షేమం కోసమే తన ఆలోచనలని తెలిపారు. భారతదేశానికి అమరావతి లాంటి కొత్త నగరాలు అవసరమని ఆర్థిక సర్వేలో చెప్పారని అన్నారు. రాయలసీమను రతనాల సీమ చేస్తామని చెప్పామని.. చేసి చూపించామని అన్నారు. దేశంలోనే ఉద్యాన ఉత్పత్తులకు రాయలసీమ మొదటి స్థానంలో ఉందని వెల్లడించారు.

రాయలసీమలో ఉద్యాన రంగం అభివద్ధి..

రాయలసీమలో ఉద్యాన రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు మాటిచ్చారు. ఎమ్మెల్యేల పని తీరు ప్రతి వారం విశ్లేషిస్తూనే ఉన్నానని తెలిపారు. కార్యకర్తలకు, తనకు కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా ఉండేందుకు పార్టీలో కూడా టెక్నాలజీని వినియోగిస్తున్నామని వివరించారు. సంక్షేమం తెస్తామని ఇంటింటికీ వెళ్లి చెప్పామని… ఆ సంక్షేమాన్ని అమలు చేస్తున్నప్పుడు కూడా ఇంటింటికీ వెళ్లాలని సూచించారు. కూటమిలోని పార్టీలతో కలిసి పని చేయాలని కేడర్‌కు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

చంద్రబాబు నాయుడిని చిత్తూరు ఎంపీ ఘనంగా ప్రశంసించారు

*ప్రజా అభ్యున్నతికి కోసం పాటు పడే గొప్ప ప్రజా సేవకులు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు..

*జనం మెచ్చిన నేత, రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన రాజకీయ వేత్త..

*ముఖ్యమంత్రి పదవికే వన్నె తెచ్చిన ప్రజాప్రతినిధి తెలుగు ముద్దుబిడ్డ చంద్రబాబు..

*భావితరాలకు ఆదర్శనీయులు, అభివృద్ధికి మారు పేరు..

*చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను…

*చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు…

కుప్పం(నేటి ధాత్రి:

ప్రజా అభ్యున్నతికి కోసం పాటు పడే గొప్ప ప్రజా సేవకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు కొనియాడారు.
ప్రజల గురించి ఆలోచించే చంద్రబాబు లాంటి నిత్య శ్రామికులు మరొకరు లేరుని
కుండబద్దలు కొట్టారాయన.
మూడు రోజుల పర్యటన నిమిత్తం కుప్పం నియోజకవర్గానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మొదటి రోజు హెలిప్యాడ్ వద్ద సాదర స్వాగతం పలికిన చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు.., రెండో రోజు కుప్పంలో నిర్వహించిన పేదల సేవలో ప్రజా వేదిక సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో కలసి చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా భావించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవ్యాంధ్ర సాధనకు అహర్నిశలు శ్రమిస్తున్నారని, సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు చేరువ చేసి, వారి జీవితాల్లో వెలుగులు నింపి,
జనం మెచ్చిన నేతగా,..ప్రజలు హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారని ప్రశంసించారు.
అలాగే సమకాలీన రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన రాజకీయ వేత్తగా ఎదిగారని,
ముఖ్యమంత్రి పదవికే వన్నె తెచ్చిన ప్రజాప్రతినిధిగా.., తెలుగు ముద్దుబిడ్డగా.‌., చంద్రబాబు ఖ్యాతి గడించారని అభినందించారు.
భావితరాలకు ఆదర్శప్రాయంగా.., అభివృద్ధికి చిరునామాగా చంద్రబాబు కీర్తి ప్రతిష్టలు ఆర్జించి, నవ సమాజానికి స్ఫూర్తిగా నిలిచారని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రశంసించారు.
చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా ఆయన నాయకత్వంలో పనిచేయడం ఆనందంగా ఉందని చెప్పిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, కుప్పం ప్రగతిలో తాను భాగస్వామ్యం కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని, అదే సమయంలో చిత్తూరు పార్లమెంటు ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, తనను ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు చెప్పారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version