జర్నలిస్టులపై ఎమ్మెల్యే మాటలను ఖండిస్తున్నా
ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొత్తూరి రవీందర్.
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జర్నలిస్టు సోదరులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని.ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొత్తూరి రవీందర్ భూపాలపల్లి కాకతీయ ప్రెస్ క్లబ్లో లో పత్రిక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ…
భూపాలపల్లి నియోజకవర్గం లో రాజకీయ నాయకులకు , అధికారులకంటే భిన్నంగా ఎటువంటి ఆశ ఆశయాలు లేకుండా వేతనాలు లేకుండా ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి నాయకుల దృష్టికి తీసుకుపోతున్న పత్రిక ,మీడియా సోదరులపై స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడిన మాటలను నేను తీవ్రంగా ఖండిస్తూన్న .ఈరోజు మీరు అధికారంలోకి రావడానికి అదే అవమానించబడ్డ మీడియా కారణమని మీకు తెలియజేస్తన్నా జర్నలిస్టు సోదరులు లేకుంటే మీరు చేసిన ప్రోగ్రాములు మీరు చేసిన కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లేవా అని అడుగుతా ఉన్నా మరి ఏ ఆశ లేకుండా ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు వానైనా ఎండైనా ఏ సమయంలోనైనా వెనకకుంట జనకకుండా ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను అధికారుల దృష్టిలకు నాయకుల దృష్టికి తీసుకువచ్చి అట్టి సమస్యలను పరిష్కార దిశగా ఈరోజు జర్నలిస్ట్ సోదరులు చేస్తా ఉన్నారు మీ ఎమ్మెల్యే పదవి కంటే ఎక్కువ సేవ ఈరోజు మీడియా సోదరులు చేస్తా ఉన్నారు కాబట్టి తక్షణమే స్థానిక ఎమ్మెల్యే
గండ్ల సత్యనారాయణ రావు జర్నలిస్టు సోదరులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కోశాధికారి బొజ్జాపెల్లి మహర్షి,రేణుకుంట్ల అరవింద్, బచ్చల చిరంజీవి,గుర్రం నాగరాజ్ లు పాల్గొన్నారు