కోటగుళ్ళకు రూ.80 వేలతో నాగేంద్ర సహిత అర్ధనారీశ్వర తొడుగు బహుకరణ..

కోటగుళ్ళకు రూ.80 వేలతో నాగేంద్ర సహిత అర్ధనారీశ్వర తొడుగు బహుకరణ

గణపురం నేటి ధాత్రి

 

 

 

గణపురం మండల కేంద్రంలోప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ కు ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన తౌటిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వర్ణలత దంపతులు ఆలయానికి నాగేంద్ర సహిత అర్ధనారీశ్వర తొడుగును రూ 80 వేలతో శుక్రవారం బహుకరించారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి స్వర్ణలత దంపతులు స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించి పట్టు వస్త్రాలను సమర్పించారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయానికి అర్ధనారీశ్వర తొడుగును బహూకరించిన భాస్కర్ రెడ్డి, స్వర్ణలత దంపతులకు కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.ఈ కార్యక్రమంలో నగరంపల్లి మాజీ సర్పంచ్ మాదాడి సత్యలక్ష్మి నారాయణరెడ్డి, బైరెడ్డి మహేందర్ రెడ్డి ,రమాదేవి, కొమ్మెర శ్రీనివాస్ రెడ్డి శైలజ దంపతులు పాల్గొన్నారు.

మహాశివరాత్రి సందర్భంగా కోటగుళ్లను సందర్శించిన జిల్లా ఎస్పీ…

మహాశివరాత్రి సందర్భంగా కోటగుళ్లను సందర్శించిన జిల్లా ఎస్పీ

రానున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపిఎస్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలంలోని ప్రసిద్ధ కోటగుళ్లను గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, దేవుడి ఆశీస్సులు పొందారు.మహాశివరాత్రి వేడుకల సందర్భంగా ఆలయం వద్ద చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లు బందోబస్తు పై పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, రద్దీని దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి సంపత్ రావు,సీఐ కరుణాకర్ రావు,ఎస్సై రేఖ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు._

కోటగుళ్లలో ఐఎఫ్ఎస్ అధికారి పూజలు…

కోటగుళ్లలో ఐఎఫ్ఎస్ అధికారి పూజలు

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో ఐఎఫ్ఎస్ ప్రొబిషనరీ చంద్ర ప్రకాష్ సింగాల్ బుధవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని సాదరంగా ఆహ్వానించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం శాలువాలు పూలమాలతో ఘనంగా సన్మానించి ఆశీర్వచనాలు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

కోట గుళ్లు దేవాలయంలో గణేశ్వరునికి ప్రత్యేక అభిషేకం

గణేష్వరునికి ప్రత్యేక అభిషేకం జిల్లా జడ్జి రమేష్ బాబు

అద్భుత శిల్ప సంపద కోట గుళ్ళు దేవాలయం

శిల్ప సంపదను భావితరాలకు అందించాలి

జిల్లా జడ్జి రమేష్ బాబు, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో అద్భుత శిల్ప సంపద కోట గుళ్ళు దేవాలయమని
ఆలయ శిల్ప సంపదను భావితరాలకు అందించాలని భూపాలపల్లి
జిల్లా జడ్జి రమేష్ బాబు, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి గంగినేని అఖిల లు అన్నారు. ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని సాదరంగా ఆహ్వానించారు. శనివారం శని త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకొని జడ్జిలు వారి కుటుంబ సభ్యులతో కలిసి గణపతి, నందీశ్వరుడికి పట్టు వస్త్రాలు సమర్పించి గణపేశ్వరునికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం జడ్జిల ను కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించి ఆశీర్వచనాలు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

వీరి వెంట జడ్జి అఖిల తల్లిదండ్రులు గంగినేని పద్మావతి శ్రీనివాసరావు దంపతులు ఉన్నారు. జిల్లా జడ్జి రమేష్ బాబు
గోశాల గోమాతలకు రూ 10 వేలతో దానా బస్తాలను అందజేశారు. గోశాల గోమాతలకు దాన బస్తాలను అందజేసిన జడ్జి కుటుంబ సభ్యులకు కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version