శ్రీరామ దళ్ నియోజకవర్గ కన్వీనర్‌గా కన్నబోయిన రమేష్….

శ్రీరామ దళ్ నియోజకవర్గ కన్వీనర్‌గా కన్నబోయిన రమేష్

నియామక పత్రాన్ని అందించిన రాష్ట్ర అధ్యక్షుడు వినయ్ రెడ్డి

నర్సంపేట, నేటిధాత్రి:

శ్రీరామ దళ్ నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్‌గా కన్నబోయిన రమేష్‌ను నియమించారు. ఈ నియామకాన్ని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నంద్యాల వినయ్ రెడ్డి ప్రకటించారు.సంస్థ పట్ల నిబద్ధత, హిందూ ధర్మ పరిరక్షణలో ఆయన చూపించిన సేవలు, యువతలో జాతీయ భావజాలాన్ని పెంపొందించేందుకు చేసిన కృషిని గుర్తించి ఈ కీలక బాధ్యతలను అప్పగించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు తెలిపారు. నర్సంపేట నియోజకవర్గంలో శ్రీరామ దళ్ కార్యక్రమాలను మరింత బలోపేతం చేసి, సమాజ సేవలో ముందుండాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా కన్నబోయిన రమేష్ మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ, సంస్థ అభివృద్ధి మరియు ఆశయ సాధన కోసం అహర్నిశలు శ్రమిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీరామ దళ్ రాష్ట్ర ఖజానాధికారి మచ్చిక రవితేజ, వరంగల్ జిల్లా అధ్యక్షుడు కొరటాల శ్రీనివాసరావు, భూసాని రమేష్, నాగరాజ్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version