కంది విజయలక్ష్మి పార్థివ దేహం వద్ద నివాళులర్పించిన మంత్రి సీతక్క
ములుగు జిల్లా నేటిధాత్రి:
ఈ రోజు ములుగు మండలం జగ్గన్న పేట గ్రామానికి చెందిన డిప్యూటీ తహసీల్దార్ కంది మహేశ్వర్ రెడ్డి తల్లి కంది విజయ లక్ష్మి నిన్న రాత్రి అకాల మరణం చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి విజయ లక్ష్మి పార్థివ దేహం వద్ద నివాళులు అర్పించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అదే విధంగా ఇదే గ్రామానికి చెందిన
జెట్టి సమ్మయ్య ఇటీవలే మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి ఆర్ధిక సాయం అందించిన మంత్రి సీతక్క ఈ కార్యక్రమములో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లాడి రామ్ రెడ్డి జిల్లా గ్రంధాలయం సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.