కోటగుళ్లలో కాకతీయ కుడ్యచిత్రాల పరిరక్షణ కావాలి

కోటగుళ్లలో కాకతీయుల కుడ్యచిత్రాలను సంరక్షించాలి

మూడు రోజులపాటు టార్చ్ ఆధ్వర్యంలో చిత్రాల పరిశీలన

కుడ్యచిత్రాలను భావితరాలకు అందించాలని టార్చ్ కార్యదర్శి అరవింద్ ఆర్య విజ్ఞప్తి

టార్చ్ ఆధ్వర్యంలో పురావస్తు శాఖ ఉన్నతాధికారులకు లేఖలు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో కాకతీయుల చారిత్రక సంపద కోటగుళ్లు ఆలయంలో ఉన్న సుమారు 800 ఏళ్ల నాటిఅరుదైన కుడ్యచిత్రాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని టీం ఆఫ్ రీసెర్చ్ ఆన్ కల్చర్ హెరిటేజ్ (టార్చ్) కార్యదర్శి చరిత్రకారుడు అరవింద్ ఆర్య అన్నారు. గత మూడు రోజులుగా కోటగుళ్ళు ఆలయ సముదాయాల్లో కుడ్య చిత్రాలను టార్చ్ ఆధ్వర్యంలో నలుగురు బృందం పరిశీలించి ఫోటోలు వీడియోలు చిత్రీకరించారు. ఈ సందర్భంగా అరవింద్ ఆర్య మాట్లాడుతూ శిల్ప సంపద నిర్లక్ష్యానికి గురవుతున్నాయని ఆలయ రాతి దూలాలు, పైకప్పు పలకలపై సహజ రంగులతో చిత్రించిన నర్తకులు, కిన్నెరలు, హంసలు వంటి దృశ్యాలు నేటికీ కాకతీయుల కళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని కాలక్రమంలో వాతావరణ ప్రభావాలు, సరైన సంరక్షణ లేకపోవడం వల్ల ఈ చిత్రాలు మసకబారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కుడ్య చిత్రాలకు సంబంధించిన అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. కోటగుళ్లలోని కాకతీయ కాలపు కుడ్యచిత్రాలను శాస్త్రీయ పద్ధతుల్లో పరిరక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పురావస్తు శాఖను కోరారు.
కాకతీయుల పాలనా కాలం తెలంగాణ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయమని వారి వారసత్వానికి ఈ కుడ్యచిత్రాలు కీలక ఆధారాలని అరవింద్ ఆర్య తెలిపారు. శిల్పకళతో పాటు చిత్రలేఖనంలో కూడా కాకతీయులు ఎంత నిష్ఠాతులో ఈ చిత్రాలు స్పష్టంగా చూపిస్తున్నాయని ఆయన అన్నారు. సరైన పరిరక్షణ లేక ఇప్పటికే 90 శాతం చిత్రాలు పాడయ్యాయని , వీటిని తక్షణం కాపాడాల్సిన అవసరం ఉందని ఈ విషయమై పురావస్తు శాఖ డైరెక్టర్‌కు లేఖ ద్వారా వినతి చేసినట్లు తెలిపారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి కోటగుళ్లలోని ఈ అమూల్యమైన కుడ్యచిత్రాలను కాపాడితే, భవిష్యత్ తరాలకు కాకతీయుల కళా వైభవాన్ని అందించినట్లవుతుందని అరవింద్ ఆర్య అన్నారు. ఈ పరిశోధనలో తాళ్ల పెళ్లి నందకిషోర్, అరుణ్ కుమార్ నలిమెల , నవీన్,లు పాల్గొన్నారు.

గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్న .!

గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్న మడికొండ శ్రీను

పరకాల నేటిధాత్రి
సోమవారం రోజున కాకతీయ యూనివర్సిటీలో జరిగిన 23 వ స్నాతకోత్సవం కార్యక్రమంలో డాక్టర్.మడికొండ శ్రీనుకి ప్రభుత్వ పాలన శాస్త్ర విభాగంలో పిహెచ్డి డాక్టరేట్ పట్టా ప్రధానం చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్.ఈ కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ ఛాన్సలర్ జిష్ణు దేవ్ వర్మ,వైస్ ఛాన్సెలర్ ప్రతాప్ రెడ్డి,ఎగ్జామ్ నేషన్ కంట్రోలర్ రామ్ చంద్రం, మరియు కాకతీయ యూనివర్సిటీ పాలక మండలి సభ్యులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కాకతీయ ఆటో యూనియన్ అధ్యక్షునిగా రెంటాల మోష.

కాకతీయ ఆటో యూనియన్ అధ్యక్షునిగా రెంటాల మోష ఎన్నిక

గణపురం నేటి ధాత్రి

 

 

 

గణపురం మండల కేంద్రంలోని కాకతీయ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ లను నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికలో ప్రెసిడెంట్ గా రెంటాల మోషన్ వైస్ ప్రెసిడెంట్ గా బొనగాని రాజశేఖర్ కాకతీయ ఆటో యూనియన్ డ్రైవర్ల సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది. నూతనంగా ఎన్నుకోబడిన ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ వారికి యూనియన్ బాధ్యతలప్పగిస్తూఎన్నుకున్నందుకు ఆటో డ్రైవర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు ఎండి హుస్సేన్ జి శ్రీనివాస్ ఆర్ సంపత్ పి గోపి కే రాహుల్ కే జానయ్య బి ప్రవీణ్ ఎస్ వెంకట్ కె రమేష్ డి అశోక్ డి గణేష్ ఎస్ రాజు టి రమణ పాల్గొన్నారు.

శ్రీ సాయి డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రభంజనం.

శ్రీ సాయి డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రభంజనం.

నేటి ధాత్రి భద్రాచలం :

కాకతీయ యూనివర్సిటీ ప్రకటించిన 1వ,3వ,5వ సెమిస్టర్ డిగ్రీ పరీక్ష ఫలితాలలో భద్రాచలం పట్టణానికి చెందిన శ్రీ సాయి డిగ్రీ కళాశాల విద్యార్థులు అత్యంత మెరుగైన ప్రతిభను కనబరిచారు.
ఉత్తమ ఫలితాలు సాధించిన 1వ,3వ,5వ సెమిస్టర్ విద్యార్థుల్లో ప్రథమ స్థానంలో మొదటి సెమిస్టర్ విద్యార్థిని పుట్టి స్వాతి 8.94 బి.యస్.సి. (యమ్ పి.సియస్), ద్వితీయ స్థానంలో మూడవ సెమిస్టర్ విద్యార్థిని యస్. వినీషా 8.72 (బి.కామ్), తృతీయ స్థానంలో మొదటి సెమిస్టర్ విద్యార్థి సిహెచ్. సాయిక్రిష్ణ 8.64 బి.యస్.సి. (యమ్. సి.సియస్)* మరియు ఉత్తమ ఫలితాలు సాధించిన ఐదవ సెమిస్టర్ విద్యార్థులు , పి.కావ్య 8.58, వై .గగన 8.54, వి.పూజిత 8.18, ఓ.సోనీ సరయు 8.40, జె.స్నేహాలత 8.32, జి.ప్రియాంక 8.43, కొమరం నాగలక్ష్మి(బి.ఏ) 8.10 , ఉత్తమ ఫలితాలు సాధించిన మూడవ సెమిస్టర్ విద్యార్థులు ఎస్కె హుస్సేన్ బీ 8.45, ఎస్కె. నజీమా బేగం 8.19, బి ఆశదీపిక 8.40 , యస్.పవన్ జగన్నాధ్ 7.78, డి.వేద వర్షిత 8.14, ఉత్తమ ఫలితాలు సాధించిన మొదటి సెమిస్టర్ విద్యార్థులు బి.శ్రీలేఖ 8.22, కె.రవళిక 8.13, జి.మౌనిక 8.41, ఎస్కె.నస్వా (బి.ఎ) 7.98. తదితర విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు.
ఈ సందర్భంగా కళాశాల డైరెక్టరులు శ్రీ కందుల రవికుమార్, శ్రీ సిద్దార్థ శ్రీనివాసరావు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బాలాజీ సింగ్, వైస్ ప్రిన్సిపాల్ డి.నరేష్ కుమార్, అకడమిక్ ఇంచార్జ్ బి.రఘు. మరియు అధ్యాపక,అద్యపకేతర సిబ్బంది విద్యార్థులను అభినందించారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version