సీఎం కప్ చెస్ పోటీలలో లవన్ బాబు జిల్లా స్థాయికి ఎంపిక:
చిట్యాల, నేటిదాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన మాటూరు లవన్ బాబు ఇటీవల జరిగిన సీఎం కప్ నిర్వహించిన చెస్ పోటీలలో తన ప్రతిభను చాటి జిల్లా స్థాయికి ఎంపికయ్యాడు,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సీఎం కప్ టోర్నమెంట్లో, చిట్యాల మండల స్థాయి చెస్ టోర్నీ లో పాల్గొని లవన్ బాబు హోరహోరి గా తలబడి.. మండల స్థాయి లో విజేతగా నిలిచి.. జిల్లా స్థాయికి ఎంపీక అవ్వడం జరిగింది. జిల్లా స్థాయికి ఎంపికైన లవన్ బాబును క్రీడాకారులు అధికారులు అభినందించి ఇంకా బాగా ఆడి రాష్ట్రస్థాయిలో మండలానికి జిల్లాకు పేరు తీసుకురావాలని అన్నారు.
