జహీరాబాద్ మున్సిపాలిటీ ఏరియా 10 వ వార్డ్ లో ఎక్కడికక్కడ మురికి నీరు నిలిచిపోయింది..

జహీరాబాద్ మున్సిపాలిటీ ఏరియా 10 వ వార్డ్ లో ఎక్కడికక్కడ మురికి నీరు నిలిచిపోయింది

జహీరాబాద్ నేటి ధాత్రి:

10 వ వార్డ్ లో నాలాల కబ్జా చేసి వెంచర్లు చేసి డబ్బులు పోగేసుకున్నారు శాశ్వతంగా మొరిల్ల నిర్మాణానికి వెంచర్ లో ప్లాట్లు ముందు మురికి కాలువ స్థలాలను ఏర్పాటు చేసిన వారికే పర్మిషన్ ఇయ్యాలి నాలా కబ్జా చేసిన వారికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కానీ మురికి కాల్వల నిర్మాణానికి మున్సిపాలిటీ అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చిన జహీరాబాద్ ఆర్డిఓ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది కబ్జాకు గురైన నాలాల కబ్జా నుంచి తొలగించి శాశ్వత నిర్మాణానికి తోడ్పడాలని,,, 10 నంబర్ వార్డ్ మహమ్మద్ ఇమ్రాన్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ,, కావాలని సమస్యలకు పరిష్కారం చూపాలి అని నూతనంగా ఎన్నికైన చైర్మన్ గారికి మరియు మున్సిపాలిటీ అధికారులకు కోరడం జరుగుతుంది ఈ మురికి నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో కాలనీలో నివసించే ప్రజలకు అనేక వ్యాధులు వస్తున్నాయి కాబట్టి తక్షణమే మురికి కాల్వలను నిర్మాణం పూర్తి చేయాలి అలాగే ఇరిగేషన్ అధికారులతో మున్సిపాలిటీ అధికారులు సాంప్రదించి గతంలో ఉన్న నాలా నక్షలో ఉన్నట్టుగా మురికి కాలువ నిర్మాణం చేస్తే గాంధీనగర్ కాలనీ గుల్షన్ నగర్ కాలనీ సలాం నగర్ కాలనీ జమాలి కాలనీ శాశ్వత పరిష్కారం చూపేలా మున్సిపాలిటీ అధికారులు వెంటనే పనులు ప్రారంభించాలి మరియు సీసీ రోడ్ల నిర్మాణం విద్యుత్ దీపాలు తాగునీటి సమస్యకు పరిష్కారం చెప్పాలన్నారు,

పట్టణంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పురపాలక కమిషనర్ ఆదేశాలు.

పట్టణంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పురపాలక కమిషనర్ ఆదేశాలు.

కల్వకుర్తి, నేటిధాత్రి:

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణములోని పలు కాలనీలను సందర్శించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన పుర పాలక కమీషనర్ మహెముద్ షేక్ పట్టణంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తున్నందున పలు కాలనీలు వార్డులలో అనగా విద్యానగర్ కాలనీలో,గాంధీనగర్ కాలనీ లో, ఎల్లికల్ రోడ్డు నందు పర్యటించి సిబ్బందికి సూచనలు చేయడం జరిగింది. ఇట్టి విషయంలో పట్టణంలో భారీ వర్షం కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలను కోరడం జరిగింది. పట్టణ పరిధిలో తాత్కాలిక నిర్మాణాలు లేదా పాడుబడ్డ భవనాలకు,విద్యుత్ స్తంబాలకు,పరికరాలకు దూరంగా ఉండాలని, కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లలో ఉండకూడదని ప్రజలకు సూచించడం జరిగింది. ప్రజలకు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే పురపాలక సంఘంఅత్యవసర టీంలకు ఫోన్ ద్వారా సంప్రదించాలని తెలియజేయడం జరిగింది.1. రంగన్న, సానిటరీ ఇన్స్పెక్టర్ 905954909,శివ, EE, 8184893646,3. యం. రాజు, జవాన్, 8341953311,4. B. శ్రీకాంత్, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ 9494271888,5. అందరూ పారిశుధ్య జవాన్లుఅదేవిదంగా భారీ వర్షం కురుస్తున్నందున పుర పాలక సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని సిబ్బందికి సూచించడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version