పిల్లలకు నాణ్యమైన పోషకాహారం అందించాలి…

పిల్లలకు నాణ్యమైన పోషకాహారం అందించాలి
శ్రీరాంపూర్: నేటిధాత్రి

అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు నాణ్యమైన పోషకాహారాలను అందించాలని, 4వ డివిజన్ కార్పొరేటర్ గుమ్మడి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం శ్రీరాంపూర్ ప్రాంతం 4వ డివిజన్ లోని అంగన్వాడి సెంటర్ -2 లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో చిన్నారులకు ఏర్పాటు చేసిన సామూహిక అక్షరాభ్యాసం, అన్నప్రాసనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంగన్వాడి కేంద్రంలో ఉన్న చిన్నారులకు పోషకాహారాలు అందించడంలో వెనుకాడరాదని అన్నారు. అలాగే అంగన్వాడి కేంద్రంలో విధిగా గర్భిణీలకు కోడిగుడ్లు, పాల ప్యాకెట్లను అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ పి సుమలత, ఆయా నాగలక్ష్మి, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version