రాజకీయాలకు అడ్డగా మారిన చిట్యాల సివిల్ ఆస్పత్రి.

రాజకీయాలకు అడ్డగా మారిన చిట్యాల సివిల్ ఆస్పత్రి.

డ్రెస్ కోడ్ పాటించని ఆసుపత్రి సిబ్బంది.

కలెక్టర్ గారూ జర దృష్టి సారించండి.

చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్.

చిట్యాల, నేటిదాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని సివిల్ ఆస్పత్రి రాజకీయాలకు అడ్డగా మారింది. చిట్యాల సివిల్ ఆస్పత్రిలో పనిచేసే సిబ్బంది డ్రెస్ కోడ్ పాటించకుండా..నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ..రాజకీయ అవతారం ఎత్తి..చిట్యాల సివిల్ ఆస్పత్రిని రాజకీయ వేదికగా మార్చుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, డీఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ మధుసూదన్ దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని, భూపాలపల్లి శాసనసభ్యులు వెంటనే తగిన చర్యలు తీసుకొని ప్రజలకు న్యాయం చేయాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ డిమాండ్ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version