అక్షర స్కూల్ లో జేరిగిన సంఘటనపై జిల్లా మంత్రి ఎమ్మెల్యే స్పందించ లేదు

అక్షర స్కూల్ లో జేరిగిన సంఘటనపై జిల్లా మంత్రి ఎమ్మెల్యే స్పందించ లేదు

రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతీయాజ్ ఇసాక్

వనపర్తి నేటిదాత్రి .

 

అక్షర స్కూల్ జరిగిన పై అధికార పార్టీ మాజీ కౌన్సిలర్ బేర సారాలు కుదరక పోవడంతో టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలేదని తెలంగాణ రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వనపర్తి జిల్లా కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెప్పారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా స్కూల్ లో జేరిగిన సంఘటన గురించి ఎమ్మెల్యే రెస్పాన్స్ కాలేదని స్కూల్ యజమాన్యాన్ని కాపాడడానికి ఎమ్మెల్యే టిఆర్ఎస్ నేతలపై స్కూల్ యాజమాన్యంతో ఫిర్యాదు చేయించారని చెప్పారు ఇంత సంఘటన జరిగితే కూడా పోలీస్ అధికారులు కనీసం విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి జరిగిన సంఘటన గురించి విలేకరులకు తెలుపలేదని ఆవేదన వ్యక్తం చేశారు మైనారిటీ ప్రజల ఓట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ముస్లిం మైనారిటీలు హిందువుల పండుగలు కలిసి ఐకమత్యంగా జరుపుకుంటారని అన్నారు నాలుగు రోజుల తర్వాత అక్షర స్కూల్లో జరిగిన సంఘటన బయటకు వచ్చిందని అన్నారు వనపర్తి లో రాజకీయాలకతీతంగా అన్ని రాజకీయ పార్టీల నేతలు సంఘాలు ఐక్యతతో అక్షర స్కూల్ అనుమతులు రద్దు చేయించాలని పిలుపునిచ్చారు అక్షర స్కూల్ సంఘటనపై జిల్లా మంత్రి వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి స్పందించలేదని కనీసం జరిగిన సంఘటనపై కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేయలేదని అన్నారు అక్షర స్కూల్ రిజిస్ట్రేషన్ పర్మిషన్ రద్దు చేయుటకు విద్యాశాఖ ఉన్నతాధికారులకు హైదరాబాదులో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి టిఆర్ఎస్ నేతల మైనారిటీల సహకారంతో ఫిర్యాదు చేస్తామని చెప్పారు ఇటువంటి స్కూల్లో తమ పిల్లలను అడ్మిషన్లు చేయవద్దని వనపర్తి ప్రజలను కోరారు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రంలో మైనారిటీలకు 102 గల్స్ కళాశాలలో ఏర్పాటు చేశారని గుర్తు చేశారు అక్షర స్కూల్ రిజిస్ట్రేషన్ రద్దు చేయుటకు వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి విద్యాశాఖ అధికారులకు లెటర్ రాయాలని ఆయన డిమాండ్ చేశారు వనపర్తి నియోజకవర్గం లో ప్రజల ఓట్లతో ఎమ్మెల్యే గెలిచారని పదవులు శాశ్వతం కాద విలువలు ముఖ్యమని అన్నారు ఈ విలేకరుల సమావేశంలో జిల్లా టిఆర్ఎస్ మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ మాజీ మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ మాజీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మైనారిటీ నేతలు అమర్ రహిమాన్ జోహెబ్ హుస్సేన్ సయ్యద్ జెమీల్ ఇమ్రాన్ వాజీద్ ఇంతీయా
జ్ పేపర్ బాయ్ షేక్ బిక్కన్ బీ ఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు

జహీరాబాద్ మండల బి. ఆర్. ఎస్ పార్టీ అధ్యక్షుడు తట్టు నారాయణ అక్రమ అరెస్ట్…

జహీరాబాద్ మండల బి. ఆర్. ఎస్ పార్టీ అధ్యక్షుడు తట్టు నారాయణ అక్రమ అరెస్ట్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులకు సంబంధించి అసెంబ్లీని ముట్టడించేందుకు తరలివస్తున్న జహీరాబాద్ మండల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తట్టు నారాయణ, మాజీ సర్పంచులు చందర్ చౌహాన్, చిన్నారెడ్డి, కరుణ్ రాజ్‌లను ఈ ఉదయం వారి ఇళ్ల వద్ద అరెస్టు చేసి జహీరాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా తట్టు నారాయణ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు అయిందని, పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఆమోదించకుండా అక్రమ అరెస్టులు చేస్తూ ఇంకెంతకాలం కాలయాపన చేస్తారని ప్రశ్నించారు. అప్పు చేసిన డబ్బుతో గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తి చేసి మూడేళ్లయిందని, బిల్లులు చెల్లించకుండా పోలీసులను, అధికారులను ఉపయోగించి పాలించడానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు ప్రభుత్వానికి గుణపాఠం నేర్పిస్తారని ఆయన హెచ్చరించారు మరియు మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.

మాల్గి మాజీ సర్పంచ్ జల్గొండ మారుతిని అక్రమ అరెస్టు…

మాల్గి మాజీ సర్పంచ్ జల్గొండ మారుతిని అక్రమ అరెస్టు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

మాజీ సర్పంచుల కోసం పెండింగ్‌లో ఉన్న బిల్లులకు సంబంధించిన నిరసనలో భాగంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళుతున్న జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండల మల్గి గ్రామ మాజీ సర్పంచ్ జలగొండ మారుతిని మార్గమధ్యంలో అక్రమంగా అరెస్టు చేసి హద్నూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ సర్పంచ్ జల్గొండ మారుతి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు అయిందని, పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించకుండా, అక్రమ అరెస్టులు చేస్తూ ఇంకెంతకాలం కాలయాపన చేస్తారని తీవ్రంగా విమర్శించారు.
రుణాలు తీసుకుని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టి మూడేళ్లయిందని ఆయన పేర్కొన్నారు. బిల్లులు చెల్లించలేని తమ అసమర్థతను దాచిపెట్టేందుకు ప్రభుత్వం పోలీసులను, ప్రభుత్వ అధికారులను వాడుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తే, రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం నేర్పిస్తారని ఆయన హెచ్చరించారు.మాజీ సర్పంచుల బకాయి బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version