గ్రామంలో తాగునీటి పైప్ లైన్ పనులను పర్యవేక్షించిన సర్పంచ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామంలో తాగునీటి పైప్ లైన్ మరమ్మత్తు పనులను సర్పంచ్ రాజు ఆదివారం పర్యవేక్షించారు. గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని ఈ సందర్భంగా సర్పంచ్ తెలిపారు. ఈ మరమ్మత్తులు గ్రామంలోని ప్రజలకు మెరుగైన తాగునీటి సరఫరాను అందించే లక్ష్యంతో చేపట్టబడ్డాయి. ప్రజలను నీకే సౌకర్యంతో పాటు స్తంభాలకు విద్యుత్ దీపాలు మురికి కాలువ పరిశుభ్రం చేయుట కార్యక్రమాలు నిర్వహిస్తున్న గ్రామ సర్పంచ్ గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రతి సమస్య పరిష్కరిస్తామన్నారు,
