గ్రామంలో తాగునీటి పైప్ లైన్ పనులను పర్యవేక్షించిన సర్పంచ్…

గ్రామంలో తాగునీటి పైప్ లైన్ పనులను పర్యవేక్షించిన సర్పంచ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామంలో తాగునీటి పైప్ లైన్ మరమ్మత్తు పనులను సర్పంచ్ రాజు ఆదివారం పర్యవేక్షించారు. గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని ఈ సందర్భంగా సర్పంచ్ తెలిపారు. ఈ మరమ్మత్తులు గ్రామంలోని ప్రజలకు మెరుగైన తాగునీటి సరఫరాను అందించే లక్ష్యంతో చేపట్టబడ్డాయి. ప్రజలను నీకే సౌకర్యంతో పాటు స్తంభాలకు విద్యుత్ దీపాలు మురికి కాలువ పరిశుభ్రం చేయుట కార్యక్రమాలు నిర్వహిస్తున్న గ్రామ సర్పంచ్ గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రతి సమస్య పరిష్కరిస్తామన్నారు,

ప్రణాళికబద్దంగా గ్రామాల అభివృద్ధి…

ప్రణాళికబద్దంగా గ్రామాల అభివృద్ధి

* ఎమ్మెల్యే కాలే యాదయ్య
* శంకర్పల్లి మండలంలో 1కోటి అభివృద్ధిపనులకు శంకుస్థాపనలు

చేవెళ్ల, నేటిధాత్రి:

 

రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య అన్నారు. గురువారం చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మండలంలోని పలు గ్రామాలలో 1.కోటి రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా యాదయ్య మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధిని ప్రణాళికాయుతంగా గ్రామాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. లక్ష్మారెడ్డిగూడ 25లక్షలు, గాజులగూడ 35లక్షలు, ,అంతప్పగూడ 25లక్షలు ,కొత్తపల్లి 25లక్షలు, గ్రామాలలో కోటి రూపాయల విలువైన ( సీసీ రోడ్డు & స్ట్రీట్ లైట్స్)వంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన లు చేశారు. ఈ కార్యక్రమాలలో సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మాజీప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

గ్రామం లో అభివృద్ధి పనులు ప్రారంభం..

గ్రామం లో అభివృద్ధి పనులు ప్రారంభం

కొత్తగూడ, నేటిధాత్రి:

 

 

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మేజర్ గ్రామ పంచాయతీ లో
నాడు పిల్లలతో… నేడు ప్రజలతో…. మొదలైన అభివృద్ధి పనులు
అందరూ నావాళ్లంటూ అభివృద్ధిపై.. మక్కువ చూపుతున్న నూతన సర్పంచ్ గా ప్రమాణం స్వీకరించి 24 గంటలు గడవకముందే అభివృద్ధి పనులు చేపట్టిన ..వార్డు సభ్యులు మీ వార్డులో ఉన్న సమస్యను నా దృష్టికి తీసుకురావాలి వెంటనే పరిష్కరించాలి లేదా మీ బాధ్యతే
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం లో ని నూతన సర్పంచ్ గా ప్రమాణస్వీకారం చేసిన24 గంటలు గడవక ముందే అభివృద్ధి పనులపై తనదైన మార్క్ చాటిన మేజర్ గ్రామపంచాయతీ కొత్తగూడ నూతన సర్పంచ్ మల్లెల భాగ్యమ్మ… సంక్షేమ గురుకుల పిల్లలకు తానే తల్లిగా నిలిచిన భాగ్యమ్మ… నేడు ప్రజా సమస్యలపై వార్డ్ వారిగా నేరుగా సమస్యలు తెలుసుకుంటూ వారి సమస్యలు తీర్చేవిధంగా అభివృద్ధి పనులు ప్రారంభించడం జరిగింది.ప్రభుత్వ ఉద్యోగం లో… ప్రజా ఉద్యోగంలో తనదైనా మార్క్…చూపించారాని గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు..ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ మల్లెల రణధీర్, ఉప సర్పంచ్ కంగాల శేఖర్, వార్డ్ సభ్యులు వార్త రాజు, సాయి ప్రియా తదితరులు పాల్గొన్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version