మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి…

మరచిపోయి కాంగ్రెస్ కు ఓటు వేయొద్దు : మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఓరిగిందేమి లేదని, తెలంగాణ 60 ఏండ్ల వెనక్కి వెళ్లిందని మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మేడ్చల్ నియోజకవర్గం ముడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జగన్ గూడ, లాల్ గడి మలక్పేట్ గ్రామంల్లో ఆదివారం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొని, భారీ ఎత్తున్న రోడ్ షో, కార్నర్ మీటింగ్ నిర్వహించారు. మునిసిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బి ఆర్ ఎస్ అభ్యర్థులను గెలిపియ్యాలని కోరారు.

 

ఈ కార్యక్రమలలో ఇంచార్జ్ గజ్జెల నాగేష్, పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మ రెడ్డి, యువనాయకులు dr భద్ర రెడ్డి, మధుకర్ రెడ్డి, మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మల్లేష్ గౌడ్, నాయకులు, బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version