*మున్సిపాలిటీ ఎన్నికల సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు*
◆-: ఎంపీ.సురేష్ కుమార్ షెట్కార్
◆-: మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ ఇంచార్జ్ డా||ఏ.చంద్రశేఖర్
◆-: సెట్విన్ ఛైర్మెన్ గిరిధర్ రెడ్డి
◆-: రాష్ట్ర నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి
◆-: మాజీ ఇండస్ట్రియల్ చైర్మెన్ తన్వీర్
*జహీరాబాద్ నేటి ధాత్రి:*
జహీరాబాద్ పట్టణంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో జహీరాబాద్ మున్సిపాలిటీ మరియు నూతనంగా ఏర్పాటు చేసిన కోహిర్ మునిసిపాల్టీల ఎన్నికల సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశంలో మాజీ మంత్రివర్యులు డా||చంద్రశేఖర్ ప్రసంగిస్తూ రానున్న మునిసిపల్ ఎన్నికల్లో అందరూ నాయకులు కార్యకర్తలు సమీక్షిగా పని చేసి కాంగ్రెస్ జెండా ఎగరవేయలని కొరకు, అలాగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పార్టీ పరంగా సమన్వయం పాటించి అధిష్టానం మొగ్గు చూపినా వారికే ఈ ఎన్నికల్లో పని చేసి ప్రతి ఒక్కరికీ మన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమా పథకాలను వివరించి జరుగుతున్న అభివృద్ధిని చూపిస్తూ అభ్యర్థుల గెలుపు దిశగా కృషి చేసి జహీరాబాద్ లో మరియు కోహిర్ లో కాంగ్రెస్ జెండా ఎగరేవేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఇండస్ట్రియల్ చైర్మెన్ తన్వీర్,కాంగ్రెస్ నాయకులు ఉజ్వల్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ రామ లింగారెడ్డి, పట్టణ అధ్యక్షులు కండేం.నర్సింలు, మండల అధ్యక్షులు హన్మంత్ రావ్ పాటిల్ ,మాక్సూద్ అహ్మద్,నరసింహా రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్షద్ అలీ,మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా తబ్బాసుం,కాంగ్రెస్ నాయకులు మంకల్ శుభాష్,హుగ్గేల్లి రాములు,కోహిర్ పట్టణ అద్యక్షులు శంషీర్,మాజీ ఎంపీపీ షౌకత్ అలీ తదితరులు పాల్గొన్నారు..
