పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం

భవిష్యత్ తరాల కోసం సహజ వనరుల సంరక్షణపై దృష్టి పెట్టాలి
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

నేటిధాత్రి ప్రతినిధి,వరంగల్:

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పేర్కొన్నారు. ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భూమి మనకు అందించిన సహజ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా భవిష్యత్ తరాల మనుగడను సురక్షితంగా ఉంచవచ్చన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటం అత్యంత కీలకమని, సరైన వనరుల వినియోగం ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని తెలిపారు.ప్రతి ఒక్కరూ చెట్లు నాటడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, నీటి సంరక్షణ వంటి చర్యల్లో భాగస్వామ్యం కావాలని సూచించారు. ప్రభుత్వ పథకాలతో పాటు ప్రజల భాగస్వామ్యం ఉంటేనే స్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పాల్గొన్న వారితో పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులకు పిపిటి ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం ప్రపంచ ధరిత్రి దినోత్సవం పక్షోత్సవాల పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు.అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) వైవి గణేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కనీసం 50 మొక్కలు నాటాలని, ప్రతి సంవత్సరం ఒక మొక్కను పెంచే అలవాటు చేసుకోవాలని సూచించారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఇంటింటికి ఇంకుడు గుంతలు నిర్మించుకోవడం ద్వారా భూగర్భ జలాలను సంరక్షించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రామ్ రెడ్డి, జిల్లా విద్యాధికారి రంగయ్య నాయుడు, అటవీ శాఖ అధికారులు, ఇతర జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ధరిత్రి రక్షణలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకం

ధరిత్రి రక్షణలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకం

నర్సంపేటలో ధరిత్రి దినోత్సవం అవగాహన కార్యక్రమం

నర్సంపేట,నేటిధాత్రి:

ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా నర్సంపేట పట్టణంలోని విజ్‌డమ్ పాఠశాలలో స్వయంకృషి సోషల్ వర్క్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్ సయ్యద్ జావిద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణపై చర్చించారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న గిరగాని సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ భూమిని కాపాడటం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. “మన శక్తి – మన భూమి” అనే నినాదంతో అందరూ కలిసి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.రిసోర్స్ పర్సన్‌గా బెజ్జంకి ప్రభాకర్ మాట్లాడుతూ భూమి సమస్త జీవరాశికి ఆధారం అని, దాని పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. భూతాపం, కాలుష్యం వంటి సమస్యలపై అవగాహన పెంపొందించడం అవసరమని తెలిపారు.ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, నీటి సంరక్షణ, మొక్కలు నాటడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. బోయిని వెంకటస్వామి మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయం ద్వారా భూమి సారాన్ని కాపాడవచ్చని వివరించారు.
కార్యక్రమం ముగింపులో విద్యార్థులతో “నెల తల్లి”ను రక్షిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో ప్రకాష్, రవీందర్ తదితరులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రపంచ పుడమి తల్లి దినోత్సవ శుభాకాంక్షలు

ప్రపంచ పుడమి తల్లి దినోత్సవ శుభాకాంక్షలు

భూమి పేదవాడికి ఆత్మగౌరవంతో సమానం

పరకాల,నేటిధాత్రి

భూమి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏర్పడిందిగా మనకు తెలుసు ఇలా ఏర్పడింది అనేదానికి ఖచ్చితమైన ఆధారాలు సామాన్యులుగా మనము చెప్పలేము ఈ భూమి అనేది ఈ విషయంలో ఒక గ్రహం సౌర కుటుంబంలో సూర్యుని నుండి మూడవ గ్రహంగా మనం చదువుకునే రోజుల్లో నుండి చెప్పుకుంటున్నాము, ఈ గ్రహంలోనే మానవుడికి సమస్త జీవరాసులు జీవనం కొనసాగించడానికి అనుకూలమైన గ్రహం కొండలు గుట్టలు నీరుతో కూడిన మహాసముద్రాలు ఉన్నటువంటి గ్రహం ఈ భూమిని రైతుల దున్ని పంట పండిస్తారు అలాగే ఇది వారసత్వపు ఆస్తి మరి ముఖ్యంగా పేదవాడికి వారసత్వంగా ఆస్తి ఉండవచ్చు(ప్రభుత్వం ఇచ్చిన భూమి ఆస్తి)భూమిలో కొన్ని వేల సంవత్సరాలుగా ఉండిపోయిన వ్యర్ధపదార్థాల ద్వారా భూమిలో ఖనిజాలను బొగ్గు బంగారం ఇనుము అనేక రకాలైన మానజీవనానికి ఉపయోగపడే కనిజాలు లభించడం భూమి యొక్క ప్రత్యేకత భూమి పైన వ్యర్ధాలు అనేకంగా పడవేస్తాము ప్లాస్టిక్ చెత్తాచెదరం పడవ ఇస్తాం భూమిపైన చెట్లు నాటడం ద్వారా ఆక్సిజన్ అలాగే చెట్ల ద్వారా వర్షాలు పడటానికి అవకాశం ఉంటుంది.గత కొద్ది 10,15 సంవత్సరాల లో తెలంగాణ రాష్ట్రంలో భూమి యొక్క విలువ అందనంత తారాస్థాయికి చేరుకుంటుంది.సామాన్యులు పేదవాడు తన ఆస్తిగా కొనుక్కోవడానికి వీలు లేనంతగా పెరిగిపోతుంది.భూమి యొక్క ధర పేదవాడు పేదవాడి గానే పడుతున్నాడు పేదవాడిగానే మరణిస్తున్నాడు మనిషి మరణించాక తన శివాని పూడ్చుకోవడానికి దహనం చేసుకోవడానికి కనీసం ఆరడుగుల భూమి లేకుండా పోయింది.ఈ రాష్ట్రంలో భూమి ప్రతి పేదవాడికి ఆస్తి హక్కు లాంటిది కదా! మరి ఎందుకు పేదవాడికి భూమి లేకుండాపోయింది.తరతరాలుగా భూమికి నోచుకోని జీవితాలు ఎన్ని ఏళ్ల స్వాతంత్ర భారతంలో ఇంకా పేదవాడిగా బ్రతుకుతున్నాడు.నిరుపేదలైనటువంటి వారిని గుర్తించి నివాస స్థలాలు పట్టా చేసి ఇవ్వాలి,వ్యవసాయ భూమి సాగు చేసుకోవడానికి ప్రభుత్వం అసైన్డ్ భూములు ఇవ్వాలి గత కొంతకాలంగా గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి నివాస స్థలాలు వ్యవసాయ అసైన్డ్ భూములు ప్రభుత్వాలు మారుతున్నటువంటి కార్యక్రమం లో పేదవాడికి ఆత్మగౌరవంగా ఉన్న భూమిని పరిశ్రమల పేరిట ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట భూమిని లాక్కుంటున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాము ప్రస్తుత కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో “భూమి ఎవరి చేతుల్లో ఉంది” అతి తక్కువ జనాభా ఉన్న వారి దగ్గర అధిక మొత్తంలో భూమి ఉన్నది అతి ఎక్కువ జనాభా ఉన్న వారి దగ్గర చాలా తక్కువ భూమి ఉన్నది మరి దేశానికి రాష్ట్రానికి కావాల్సిన టాక్సీలు కట్టడం తమ శ్రమను పెట్టి రాష్ట్రాలను దేశాన్ని కాపాడడం జరుగుతుంది కదా పేదవారు, వారికి ఎందుకు భూమి లేకుండా పోయింది.ఇన్ని సంవత్సరాలుగా ఏ ఒక్కరు అయినా ప్రశ్నించిండ్రా,ఈ తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా డాక్టర్ విశారదన్ మహారాజు పేదవాడిని గుర్తించి పక్క ఇంటి నిర్మాణ స్థలాన్ని పట్టా చేసి ఇవ్వాలని వ్యవసాయ భూమి పట్టా చేసి ఇవ్వాలని తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్కడు అడుగుతున్న నిరుపేదల నాయకుడు ప్రతి పేదవాడికి భూమిని పంచాలి భూమిని కాపాడాలి పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి భూమి ప్రతి ఒక్కరికి ఆస్తి హక్కుగా ఉండాలి లక్షల ఎకరాలు భూమి ఉన్న తెలంగాణలో భూమిని పంచరు భూమి పుత్రులు అని చెప్పుకుంటూ ఉంటాం మనం ఆగస్టు 9న ఆదివాసుల దినోత్సవం జరుపుకుంటాం మరి ఈ దేశ భూమి పుత్రులుగా చెప్పుకుంటున్నప్పుడు కనీసం భూమి కూడా లేకపోవడం ఎంత అన్యాయం ఎంత దౌర్భాగ్యం ఈ తెలంగాణలో అతి తక్కువ జనాభా ఉన్న వారి దగ్గర రాజ్యం భూమి సంపద ఉంది మరి పేదలకు భూమి కావాలంటే రాజ్యం కోసం పోరాటం చేయలి అప్పుడు మాత్రమే ప్రతి పేదవాడికి భూమి పంచగలం మాట్లాడితే రైతు రాజు కావాలంటారు కనీసం కూడు గూడు,గుడ్డ లేనటువంటి ఆవాసానికి కూడా నోచుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో నేటి తెలంగాణ లోని మనం చూస్తున్నాం ఇక రైతు ఎలా రాజు అవుతాడు రైతు స్వరాజ్య వేదిక తెలిపిన ఘనంకాల ప్రకారం 70లక్షల మంది పట్టాదారు రైతులు ఉంటే అందులో 25 లక్షలకు పైగా కౌలు రైతులు ఉన్నారు.అంటే ఇక్కడ ప్రభుత్వ పథకాలకు నోచుకోలేని కవులు రైతులు అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నేడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది 80 శాతానికి పైగా కవులు రైతులే ఆత్మహత్యలు చేసుకున్నాను తెలుస్తుంది.రాజ్యాంగ బద్దంగా రాజకీయాలకు కనుక చేస్తే భూమి లేనోడికి భూమి పంచండి ఈ భూమి (పుడమి) తల్లి దినోత్సవం సందర్భంగా మీరు భూమిని పంచగలరా!కానీ మీరు పంచలేరు ఎందుకంటే భూమి ఏ ఆత్మగౌరవం,భూమి సంపదను సృష్టిస్తుంది,సంపద రాజకీయాన్ని సృష్టించగలుగుతుంది,రాజకీయ ఎత్తుగడతో అధికారాన్ని చేజిక్కించుకుంటారు అధికారానికి వస్తారందుకని భూమిని పంచరు ఎన్ని ఎకరాల భూమి ఉందని రైతుభరోసా విడుదల చేస్తారు.ఎవరి దగ్గర ఎక్కువ భూమి ఉంది రాజకీయ స్వలాభం కోసం చేస్తున్నటువంటి కుట్రబూరిత రాజకీయాలు భూమి పుడమి తల్లి దినోత్సవం సందర్భంగా మీరు ప్రభుత్వాలు పేదవాడిని గుర్తించి భూమిని పంచండి.

ఇనుగాల దిలీప్ మహారాజ్ ధర్మసమాజ్ పార్టీ నాయకులు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version