ధరిత్రి రక్షణలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకం

ధరిత్రి రక్షణలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకం

నర్సంపేటలో ధరిత్రి దినోత్సవం అవగాహన కార్యక్రమం

నర్సంపేట,నేటిధాత్రి:

ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా నర్సంపేట పట్టణంలోని విజ్‌డమ్ పాఠశాలలో స్వయంకృషి సోషల్ వర్క్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్ సయ్యద్ జావిద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణపై చర్చించారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న గిరగాని సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ భూమిని కాపాడటం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. “మన శక్తి – మన భూమి” అనే నినాదంతో అందరూ కలిసి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.రిసోర్స్ పర్సన్‌గా బెజ్జంకి ప్రభాకర్ మాట్లాడుతూ భూమి సమస్త జీవరాశికి ఆధారం అని, దాని పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. భూతాపం, కాలుష్యం వంటి సమస్యలపై అవగాహన పెంపొందించడం అవసరమని తెలిపారు.ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, నీటి సంరక్షణ, మొక్కలు నాటడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. బోయిని వెంకటస్వామి మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయం ద్వారా భూమి సారాన్ని కాపాడవచ్చని వివరించారు.
కార్యక్రమం ముగింపులో విద్యార్థులతో “నెల తల్లి”ను రక్షిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో ప్రకాష్, రవీందర్ తదితరులు, విద్యార్థులు పాల్గొన్నారు.

పచ్చని చిగురులు ప్రకృతికి వెలుగులుపూల అందాలతో మరింత అలంకారం

పచ్చని చిగురులు ప్రకృతికి వెలుగులుపూల అందాలతో మరింత అలంకారం

పరకాల,నేటిధాత్రి

వేసవి ప్రారంభంతోనే ప్రకృతి మళ్లీ పచ్చని వర్ణాలతో కళకళలాడుతోంది.పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో చెట్లు కొత్తగా చిగురించడం ప్రారంభించడంతో పరిసరాలు ఆహ్లాదకరంగా మారాయి.ఎండ తీవ్రత పెరుగుతున్న ఈ కాలంలో చెట్లపై వెలసిన పసిడి-పచ్చని ఆకులు ప్రకృతికి ప్రత్యేక ఆకర్షణను తీసుకొస్తున్నాయి.ఉదయం,సాయంత్రం వేళల్లో ప్రజలు బయటకు వచ్చి ఈ సహజ సోయగాలను ఆస్వాదిస్తున్నారు.ముఖ్యంగా రోడ్ల వెంట చిగురించిన చెట్లు పర్యావరణానికి శోభను చేకూరుస్తున్నాయి.పక్షుల కిలకిలారావాలు,తేలికపాటి గాలులు కలిసిన ఈ దృశ్యం మరింత మనోహరంగా మారుతోంది.ఇదిలా ఉండగా,రంగురంగుల పూలతో రోడ్లకు ఇరువైపులా పువ్వుల అందాలు విరబూస్తూ ప్రయాణికుల కనులకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి.పూల సువాసనలు,పచ్చని చెట్ల మధ్య కలిసిన ఈ వాతావరణం ప్రకృతిని మరింత సుందరంగా మార్చుతోంది.గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా చిగురించిన చెట్లు పల్లె అందాన్ని మరింత పెంచుతున్నాయి.ఈ పచ్చదనం ప్రయాణికులకు చల్లని అనుభూతిని కలిగిస్తూ సహజ వాతావరణాన్ని ప్రతిబింబిస్తోంది.ప్రకృతి అందాలను కాపాడుకోవాలంటే చెట్ల సంరక్షణపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నారు. వేసవిలో చెట్లకు తగినంత నీరు అందించడం,కొత్త మొక్కలు నాటడం ద్వారా పచ్చదనాన్ని మరింత విస్తరించవచ్చని వారు పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version