మొగుళ్ళపల్లి మండలంలో గండ్ర పరామర్శ…
మొగుళ్లపల్లి నేటి ధాత్రి
భూపాలపల్లి నియోజకవర్గం లోని మొగుళ్లపల్లి మండలం
మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ వెంకట్ రావు గారి మామగారు దుగ్యాల చోక్కారావు మరియు వారి బాబాయ్ పిన్నింటి రాజేశ్వర్ రావు మరణించగా మృతుల చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను కలిసిన భూపాలపల్లి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి పరామర్శించిన తదనంతరం పాత ఇస్సిపేట వాస్తవ్యులు జన్నే సదయ్య గారు అనారోగ్యం తో బాధపడుతున్న వారిని పరామర్శించి,వారికి మనోధైర్యం చెప్పారు.
వారి వెంట సర్పంచ్ జోరుక సదయ్య చిట్యాల మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొడాలి రమేష్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
