జంక్షన్ పై నిర్లక్ష్యం తగునా..
పట్టించుకోని పాలకులు, మున్సిపల్ అధికారులు
యధావిది స్థితిలోనే వాటర్ ఫౌంటెన్
పరకాల,నేటిధాత్రి
పట్టణ సుందరీకరణలో భాగంగా అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటెన్ ప్రస్తుతం పూర్తిగా నిర్లక్ష్యానికి గురై నిలిచిపోయింది.నెలలుగా ఫౌంటెన్ పనిచేయకపోయినా అధికారులు,పాలకులు స్పందించకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పట్టణ అభివృద్ధి పేరుతో లక్షల రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన ఫౌంటెన్ ఈరోజు పనికిరాని స్థితిలో ఉండటం స్థానికులను నిరాశకు గురి చేస్తోంది.పట్టణం మధ్యలో ఉన్న అంబేద్కర్ విగ్రహం ప్రాంతం ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రాంతం.ఈ ప్రాంతాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ఫౌంటెన్ ఏర్పాటు చేశారు.ప్రారంభంలో కొన్ని రోజులు మాత్రమే పనిచేసిన ఫౌంటెన్ ఆ తర్వాత పూర్తిగా నిలిచిపోయింది.ప్రస్తుతం ఫౌంటెన్ చుట్టూ చెత్త పేరుకుపోవడంతో ఆ ప్రాంతం అందాన్ని కోల్పోయింది.ఫౌంటెన్ పనిచేయకపోవడమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతం కూడా నిర్లక్ష్యంగా మారిందని స్థానికులు చెబుతున్నారు.అక్కడ ఏర్పాటు చేసిన నిర్మాణాలు కూడా తప్పుపట్టే పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు.పట్టణ సుందరీకరణకు ప్రతీకగా నిలవాల్సిన ఫౌంటెన్ ఇలా నిలిచిపోవడం బాధాకరమని పలువురు పేర్కొంటున్నారు.ప్రజల డబ్బుతో ఏర్పాటు చేసిన పనులు ఇలాగే నిర్లక్ష్యానికి గురికావడం సరైంది కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రజలకు ఉపయోగపడేలా,పట్టణానికి అందాన్ని తీసుకురావాల్సిన ఈ ఫౌంటెన్ ఇప్పుడు వ్యర్థంగా మారిందని విమర్శలు వినిపిస్తున్నాయి.ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయంపై పెద్దగా పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. పట్టణ అభివృద్ధి గురించి మాటలు చెప్పే నాయకులు, ఇలాంటి సమస్యలపై స్పందించకపోవడం ఆశ్చర్యంగా ఉందని వారు వ్యాఖ్యానిస్తున్నారు.ప్రజలు ఎదుర్కొంటున్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడంలో కూడా నాయకులు ముందుకు రావడం లేదని అంటున్నారు.అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్న ఈ ఫౌంటెన్ పట్టణానికి ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉండాల్సింది.కానీ నిర్వహణ లోపంతో అది ఇప్పుడు నిలిచిపోయి నిర్లక్ష్యానికి గురైంది.ఫౌంటెన్ పునరుద్ధరణ కోసం అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఫౌంటెన్ను తిరిగి పనిచేసేలా చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.పట్టణ అభివృద్ధి పనులు కేవలం ప్రారంభం చేయడం మాత్రమే కాకుండా వాటి నిర్వహణ కూడా ముఖ్యమని గుర్తించాలన్నారు. ప్రజల సమస్యలను పట్టించుకుని పట్టణ సుందరీకరణ పనులు సక్రమంగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.లేకపోతే ఇలాంటి అభివృద్ధి పనులు కేవలం ప్రదర్శనకే పరిమితమవుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
