సీసీ కెమెరాల పాత్ర కీలకం డిజిపి.

నేరాలను నియంత్రించడంలో నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాల పాత్ర కీలకం డిజిపి

వనపర్తి నేటిదాత్రి :

 

ప్రజలు తమ వ్యక్తిగత భద్రత కోసం సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్ర డి జి పి జితేందర్ ప్రజల ను కోరారు
అమరచింత మండలం మస్తిపూర్ గ్రామంలో మస్తీపూర్ గ్రామస్తుడైన ఐజిపి రమేష్ రెడ్డి గ్రామస్తులు సహకారంతో సహకారం ఏర్పాటు చేసినతో సీసీ కెమెరాలను 46 అధునాతన సీసీ కెమెరాలను అమరచింత మండలం మస్తిపూరు గ్రామంలో ప్రధాన చౌరస్తాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను తెలంగాణ రాష్ట్ర డిజిపి డాక్టర్ జితేందర్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ ఆర్ గుర్నాథ్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్, ఐ జి రమేష్ రెడ్డి ఐపీఎస్ గారు, మల్టీజోన్ ఐజి. సత్యనారాయ జోగులాంబ జోన్ డిఐజి, ఎల్ ఎస్ చౌహన్ వనపర్తి జిల్లా ఎస్పీ,రావుల గిరిధర్ తో కలిసి సీసీ కెమెరాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా డిజిపి జితేందర్ మాట్లాడుతూ.నేరాలను నియంత్రించడంలో నిందితులను దొంగ.తనాలను గుర్తించడంలో సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని అన్నారు వనపర్తి
జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలను డిజిపి కోరారు.సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చిన తెలుస్తుందని, ఎక్కడ ఎలాంటి అలజడి జరిగిన వెంటనే పోలీసులు చేరుకుని నివారించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. సిసి కెమెరాలకు జిపిఎస్ కనెక్ట్ చేయడం వల్ల అమరచింత మస్తీపూర్ నుండి జిల్లా కమాండ్ కంట్రోల్ కు మరియు హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ కి అనుసంధానం చేసి వీక్షించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.నేరాలు నియంత్రించవచ్చని తద్వారానే నేర రహిత సమాజ నిర్మాణం సాధ్యమని, సీసీ కెమెరాల వల్ల నేరాల నియంత్రణ, శాంతి భద్రతలు కాపాడేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతాయన్నారు.పట్టణ, మండల, అన్ని గ్రామాల ప్రజలు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అదుపు చేయవచ్చని, దొంగతనాలు నివారించేందుకు అవకాశం మరియు అసాంఘిక కార్యక్రమాలు నిర్మూలించే అవకాశం ఉంటుందని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు వివిధ సంఘటన లు జరిగిన సమయంలో సీసీ కెమెరాల ద్వారా వారిని గుర్తించి పట్టుకోవడానికి అవకాశం ఉంటుందని డి జి పి తెలిపారు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ
సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం అని, సీసీ కెమెరాలు 24 గంటల నిరంతరం పనిచేస్తాయని అన్నారు
ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ ఆర్, గుర్నాథ్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్, ఐజి శ్రీ రమేష్ రెడ్డి ఐపీఎస్ గారు, మల్టీజోన్ -2 ఐజి, శ్రీ సత్యనారాయణ ఐపీఎస్, గారు , జోగులాంబ జోన్ డిఐజి, శ్రీ ఎల్ ఎస్ చౌహన్ ఐపీఎస్, గారు వనపర్తి ఎస్పీ, శ్రీ, రావుల గిరిధర్ ఐపీఎస్, గారు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గారు వనపర్తి ఏఆర్ అదనపు ఎస్పీ, వీరారెడ్డి గారు, వనపర్తి డిఎస్పి, వెంకటేశ్వరరావు గారు, ఆత్మకూరు సిఐ, శివకుమార్, అమరచింత ఎస్సై, సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version