హనుమాన్ భక్తులపై దుర్భాషలాట

హనుమాన్ భక్తులపై దుర్భాషలాట

క్షమాపణ చెప్పాలని ప్రధాన రహదారిపై రాస్తారోకో..

నర్సంపేట,

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని మహేశ్వరం గ్రామంలో హనుమాన్ మాలదారులపై అదే గ్రామానికి చెందిన అధికార పార్టీ నేత దుర్భాషలాడటం కలకలం రేపింది. మాలదారులు తెలిపిన వివరాల ప్రకారం మహేశ్వరం గ్రామానికి చెందిన హనుమాన్ భక్తులు మాల వేసుకుని హనుమాన్ గుడి దగ్గర ఉంటున్నారు. ఈ ప్రాంతంలో ఉదయం, సాయంత్రాల్లో స్థానికులు వాకింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
చెప్పులు, షూలు వేసుకుని తాము ఉండే ప్రాంతంలో నడవవద్దని భక్తులు చెప్పడంతో అధికార పార్టీకి చెందిన నేత ఒకరు హనుమాన్ భక్తులను అసభ్య పదజాలంతో దుర్భాషలాడినట్లు మాలాదారులు ఆరోపిస్తున్నారు. తమను తిట్టిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భక్తులు నర్సంపేట–వరంగల్ ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. దీంతో ట్రాఫిక్ సమస్య తలెత్తి వాహనాలు ఇరు వైపులా నిలిచిపోయాయి.ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు భక్తులకు న్యాయం జరుగుతుందని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. క్షమాపణ చెప్పాలని కోరగా నిరాకరించడంతో సంబంధిత ఇద్దరు వ్యక్తులను పోలీసులు స్టేషన్‌కు తరలించారు.

మద్దతు పలికిన శ్రీ రామ్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు..

వరంగల్ -నర్సంపేట ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలుపుతున్న హనుమాన్ భక్తులకు శ్రీ రామ్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు నంద్యాల వినయ్ రెడ్డి మద్దతు పలికారు.పవిత్రమైన హనుమాన్ దీక్షలో ఉన్న భక్తులపై అసభ్యపదజాలంతో మాట్లాడిన వ్యక్తిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.హిందూ సాంప్రదాయాలు,భక్తుల మనోభావాలు దెబ్బతీసేవింగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. హనుమాన్ భక్తులకు బహిరంగంగా చెప్పాలని వినయ్ రెడ్డి డిమాండ్ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version