క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పీఠం పై గులాబీ జెండా….

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పీఠం పై గులాబీ జెండా….

పొత్తు ధర్మాన్ని వీడని ఎర్ర సూరీలు….

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మంత్రి గడ్డం వివేక్ ఇలాఖలో చక్రం తిప్పి మునిసిపాలిటీ గద్దెపై గులాబీ జెండా ఎగిరేలా ఎర్ర సూరీల తో వ్యూహాలు రచించి విజయం సాధించారు. క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పీఠాన్ని బిఆర్ఎస్ పార్టీ సిపిఐ పార్టీతో కలిసి కైవసం చేసుకుంటున్న నేపథ్యంలో పొత్తు ధర్మాన్ని విస్మరించకుండా ఎర్ర సూరీలు గులాబీ జెండా కు జై కొడుతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి , మంత్రి ఇలాకాలో గులాబీ జెండా ఎగరడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసినప్పటికీ ప్రజా తీర్పును గౌరవించాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రం మొత్తంలో అధికార కాంగ్రెస్ పార్టీకి తోడుగా ఉన్న సిపిఐ పార్టీ నాయకులు క్యాతనపల్లిలో అందుకు భిన్నంగా బిఆర్ఎస్ పార్టీతో జతకట్టడంతో అధికారంలోకి వచ్చారు.కాంగ్రెస్ నాయకులు సిపిఐ నాయకులను తీవ్రంగా అవమానించిన నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీతో జతకట్టినట్లు ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలవేన శంకర్, మంచిర్యాల జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ లు ఎన్నికలకు ముందే స్పష్టం చేశారు. పొత్తు ధర్మాన్ని విస్మరించి ఒకవేళ ప్రస్తుత సందర్భాలలో కాంగ్రెస్ తో జతకడితే క్యాతనపల్లి మునిసిపాలిటీలో సిపిఐ పార్టీకి మునగడ కరవయ్యే అవకాశాలు లేకపోలేదు. ఎర్ర సూరీలకు ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ మునిసిపాలిటీలో గులాబీ జెండా ఎర్ర సూరీలతో కలిసి ఎగురుతోందని ప్రజలంతా భావిస్తున్నారు. అలానే జరగాలని ప్రజలంతా ఓటర్లంతా కోరుకుంటున్నారు. ఎర్ర సూరీలు సైతం పొత్తు ధర్మాన్ని విస్మరించడం లేదని ఇప్పటికే స్పష్టం చేశారు.

వ్యతిరేక చర్యలు చేపడితే ఉపేక్షించేది లేదు..

వ్యతిరేక చర్యలు చేపడితే ఉపేక్షించేది లేదు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొంబోయిన ముత్తయ్య

గుండాల,నేటిధాత్రి:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం గుండాల మండల సీనియర్ నాయకులు పొంబోయిన ముత్తయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన అత్యవసర సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల సందర్బంగా 3వ విడుతలో భాగంగా గుండాల మండల కేంద్రం గుండాల గ్రామ పంచాయతీ లో మిత్రపక్షం సిపిఐ సహకారం తో కాంగ్రెస్ పార్టీ తరుపున నిలపడిన అభ్యర్థికి కాకుండ ఇతర పార్టీలతో జతకలిసి కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేకం గా ఓట్లు వేపించి పార్టీ ఓటమి కోరుకుంటునటువంటి ఈసం పాపారావు వ్యక్తి పైన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధిష్టానం అతనిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొంబోయిన ముత్తయ్య తెలియజేసారు. గతంలో కూడా ఇలా వ్యవహరించినట్టు సమాచారం అయినా తన సీనియర్టిని గౌరవించి మందలింపూ తో సరిపెట్టడం జరిగింది కానీ పార్టీ ఓటమి కోసం పని చేస్తుంటే ఇక ఉపేక్షించేది లేదని గురువారం నుండి ఈసం పాపారావు కు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధాలు లేవని తనను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ గుండాల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియజేశారు. అంతే కాక భవిష్యత్ లో ఇలాంటి కార్యక్రమాలు ఎవరు నిర్వహించిన వారు ఏ స్థాయి వ్యక్తులు అయినా సరే పార్టీ నుండి ఇలాంటి క్రమ శిక్షణా చర్యలే ఎదురుకోవలసి వస్తదని హెచ్చరించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version