నూతన జహీరాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ లతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు నూతన జహీరాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ లతో సమావేశం నిర్వహించి వారిని సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ “అందరికి శుభాకాంక్షలు,పదవి అనేది బాధ్యత మాత్రమే కాదు, ప్రజల నమ్మకం. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు ముందుకు సాగుతారని ఆశిస్తున్నా అని అన్నారు
