ప్రభుత్వ పాఠశాలలో సీఎం కప్ జిల్లాస్థాయి సాఫ్ట్ బాల్ బేస్ బాల్ పోటీలు….

ప్రభుత్వ పాఠశాలలో సీఎం కప్ జిల్లాస్థాయి సాఫ్ట్ బాల్ బేస్ బాల్ పోటీలు.

చిట్యాల, నేటిదాత్రి :

 

జూకల్ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ జిల్లా స్థాయి సాఫ్ట్ బాల్ బేస్ బాల్ పోటీలు ఘనంగా నిర్వహించామని హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు గిరగాని కృష్ణ తెలిపారు,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డివైఎస్ఓ చిర్రా రఘు హాజరై సాఫ్ట్ బాల్ బేస్ బాల్ క్రీడల గురించి మాట్లాడారు ఈ పోటీలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనరల్ సెక్రటరీ మంచిక అభినవ్ వినయ్ కుమార్ సారధ్యంలో జిల్లాలోని 12 మండలాల నుంచి 200 మంది క్రీడాకారులు హాజరై వారి ప్రతిభను చాటారని మాట్లాడడం జరిగింది . ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా హాజరైన విద్యాశాఖ ఏఎమ్ఓ పింగిలి విజయపాల్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కప్ క్రీడల వలన జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు తెలంగాణ రాష్ట్ర స్థాయిలో పేరు రావడం శుభ పరిణామమని మాట్లాడడం జరిగింది ఈ పోటీలలో గెలుపొందిన వారిని తెలంగాణ రాష్ట్ర స్థాయి సీఎం కప్ సాఫ్ట్ బాల్ బేస్ పోటీలకు పంపిస్తామని నిర్వాహకులు బండి ప్రసాద్ గాజర్ల శ్రీనివాస్ తెలియజేశారు ఈ క్రీడా పోటీలలో ఫిజికల్ డైరెక్టర్లు సూదం సాంబమూర్తి బండి ప్రసాద్ నూకల లింగయ్య గాజర్ల శ్రీనివాస్ పూర్ణిమ సమ్మయ్య హేమలత కళ్యాణి సులోచన దొడ్డ శ్రీలత రాధికా రాణి స్వరూప సంఘ రఘుపతి హై స్కూల్ ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

బాలానగర్ లో.. సీఎం కఫ్ క్రీడలు ప్రారంభం…

బాలానగర్ లో.. సీఎం కఫ్ క్రీడలు ప్రారంభం

బాలానగర్ /నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో జనరల్ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో మండల స్థాయి సీఎం కప్ క్రీడలు ఎంఈఓ శంకర్ గురువారం ప్రారంభించారు. వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్ పోటీలను నిర్వహిస్తామన్నారు. గ్రామీణ స్థాయిలోని ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి పోటీలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థులు నియోజకవర్గ స్థాయిలో పాల్గొనవలసి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై లెనిన్ గౌడ్, నందమోని రాజేశ్వరి దత్తాత్రేయ, వార్డు సభ్యులు, వివిధ పాఠశాలల పీఈటీలు, విద్యార్థులు పాల్గొన్నారు.

సీఎం కప్ క్రీడలు ప్రారంభం…

సీఎం కప్ క్రీడలు ప్రారంభం

సీఎం కప్ మండల స్థాయి పోటీలను ప్రారంభించిన కేసముద్రం ఎమ్మార్వో జి. వివేక్

కేసముద్రం/ నేటి ధాత్రి

సీఎం కప్ క్రీడా పోటీలు సోమవారం సెయింట్ జోన్స్ హై స్కూల్ క్రీడామైదానం లో ఘనంగా ప్రారంభమయ్యాయి. మండల ఎం ఆర్ ఓ జి వివేక్ క్రీడా పోటీలను ప్రారంభించారు. అనంతరం ఎమ్మార్వో మాట్లాడుతూ మండల స్థాయిలో సీఎం కప్ ఆడే క్రీడాకారులు మంచి ప్రతిభను కనపరిచి నియోజకవర్గ మరియు జిల్లా స్థాయిలో, రాష్ట్రస్థాయిలో విజయ పదంలో రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం కబడ్డీ, ఖో ఖో, అథ్లెటిక్స్, వాలీబాల్ తదితర గేమ్స్ నిర్వహించడం జరిగింది. కాగా క్లస్టర్ లెవెల్లో క్రీడాకారులు మండల స్థాయిలో 150 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు లాల్ బహుదూర్, ఎస్ ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ సీనియర్ ఉపాధ్యాయులు డాక్టర్ కొమ్ము రాజేందర్, కొప్పుల శంకర్, దా మల్ల విజయ చందర్, కే. పద్మ, స్రవంతి, విజయనిర్మల, తారక, వీరన్న, వెంకన్న, మహేష్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version