ఆ పల్లె కన్నీరుపెడుతోంది..
పేయలవానిపెంటలో ఉపాధి కరువు గ్రామం వదిలి వలసెళ్లిన జనం నేటికి కనీస వసతుల్లేవు శిథిలమైన గృహాలు…బీళ్లుగా భూములు
ములకలచెరువు, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): అది మారుమూల గ్రామం… కొండలు, పచ్చని చెట్ల మధ్య ఉన్న అందమైన ఊరు… ఉపాధి లేని గ్రామం… భూములున్నా బోర్లు వేసుకుని సాగుచేసే స్థోమత లేదు… ఫలితంగా భూములన్నీ బీడుగా దర్శనమిస్తున్నాయి… ఉపాధి కరువై సగం ఊరు ఖాళీ అయ్యింది… బతుకు దేవుడా అంటూ పట్టణాలకు వలసెళ్లారు… ఏ వైపు చూసినా శిథిలమైన, తాళాలు పడ్డ ఇళ్లే కనపడుతున్నాయి… ఇళ్ల వద్ద వృద్ధులే అధికంగా ఉన్నారు…పాలకుల నిర్లక్ష్యం పుణ్యమా అని ఊరు కనుమరుగవుతోంది. ఇదే పేయలవానిపెంట గ్రామ ఘోష..
