అక్రమ అరెస్టులు గృహనిర్బంధాలను ఖండిస్తున్నాం కొంకుల రాజేష్…

అక్రమ అరెస్టులు గృహనిర్బంధాలను ఖండిస్తున్నాం కొంకుల రాజేష్ అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు.

బెల్లంపల్లి నేటిధాత్రి :

క్యాతనపల్లి మున్సిపాలిటీ 22 వార్డులకు ఎన్నికలు జరగగా పొత్తులో భాగంగా బీఆర్ఎస్ సిపిఐ 14 వార్డులు గెలవగా కాంగ్రెస్ 7వార్డులు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలవడం జరిగింది, మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు బీఆర్ఎస్ సిపిఐ కి తగిన మెజారిటీ ఉన్న అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రి ఎంపీలు ఈ ఎన్నిక ను వాయిదా వేయటానికి కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు, నిన్న కేతనపల్లి మున్సిపాలిటీలో బిఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్ల మీద జరిగినటువంటి దాడి వైఖరిని చూస్తే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుందని కళ్లకు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది నిన్న జరిగినటువంటి దురాగాతానికి ఈరోజు కేతనపల్లి బంద్ కి సిపిఐ బిఆర్ఎస్ బందు పిలుపు ఇవ్వడం జరిగింది, ప్రభుత్వం ఈ బందు కొనసాగకుండా పోలీస్ బలగాలను పట్టణంలోని మోహరించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు వనం సత్యనారాయణ నీ అరెస్టు చేసి జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్, మిగతా కామ్రేడ్స్ అందరి ఇంటి వద్ద బీఆర్ఎస్ నాయకుల ఇంటి వద్ద పోలీస్ బలగాలను పెట్టి వారిని ఇంట్లోనే నిర్బంధించి హౌస్ అరెస్టులను చేయడాన్ని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ మంచిర్యాల జిల్లా సమితి తీవ్రంగా ఖండిస్తోందని వారన్నార, మంత్రివర్యులు ఇప్పటికైనా ప్రజల తీర్పును గౌరవించి క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, ఎన్నికను సజావుగా జరగనివ్వాలని నిర్బంధాలతో తెలంగాణ ప్రజలను అణిచివేయలేరని గ్రహించాల్సిందిగా కోరుతున్నాం.

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 144 సెక్షన్ అమలు…

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 144 సెక్షన్ అమలు

మున్సిపల్ పరోక్ష ఎన్నికల నేపథ్యంలో కట్టుదిట్టమైన బందోబస్తు

జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపల్ ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్ పరోక్ష ఎన్నికల సందర్భంగా జిల్లాలోని మున్సిపాలిటీ పరిధిలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా, చట్టబద్ధంగా నిర్వహించేందుకు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
జిల్లా పరిధిలో 163 బీఎన్ ఎస్ఎస్ (సెక్షన్ 144) అమల్లో ఉండగా, ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడటం, అనుమతి లేకుండా ర్యాలీలు, ఊరేగింపులు, సమావేశాలు నిర్వహించడం నిషేధం. డీజేలు, మైకులు, బాణాసంచా వంటి శబ్ద కాలుష్యానికి కారణమయ్యే కార్యక్రమాలు కూడా నిషేధించబడ్డాయి. ఎన్నికల ప్రక్రియకు భంగం కలిగించే చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మున్సిపల్ పరోక్ష ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు ప్రజలు, ప్రజా ప్రతినిధులు పోలీసు యంత్రాంగానికి సహకరించాలని కోరారు.

తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక.. ఉద్రిక్తం…

తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక.. ఉద్రిక్తం

 

తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికలో టెన్షన్ నెలకొంది. భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. తొర్రూర్ మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉన్నాయి.

తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. తొర్రూర్ మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉన్నాయి. ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 18 ఓట్లు ఉంటాయి. చైర్మన్ ఎన్నికకు మేజిక్ ఫిగర్ 10 ఓట్లు అవసరం. తాజా మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రకారం బీఆర్ఎస్‌కు 9 వార్డులు, కాంగ్రెస్‌కు 7 వార్డులు దక్కాయి. అయితే ఎమ్మెల్యే, ఎంపీల ఎక్స్ అఫీషియో ఓట్లతో కాంగ్రెస్ బలం 9కి చేరింది. దీంతో రెండు పార్టీల మధ్య గట్టి పోటీ ఏర్పడింది.
బీఆర్ఎస్ నుంచి ఇద్దరు వార్డు కౌన్సిలర్లు పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీన్ని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ జనసమీకరణ వ్యూహం అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో చైర్మన్ ఎన్నిక సమయంలో రెండు పార్టీల మధ్య ఉద్రిక్తత తీవ్రమైంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు భారీగా మోహరించారు. ప్రస్తుతం ఉద్రిక్తత కొనసాగుతోంది. ఎన్నికల ప్రక్రియ సాఫీగా జరిగేలా అధికారులు, పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version