వర్గ పోరాటమే ప్రత్యామ్నాయం: ఎంసిపిఐ(యు) కార్యదర్శి

వర్గ సామాజిక పోరాటాలే ప్రత్యామ్న్యాయం

నిర్మాణాత్మక ఉద్యమాలు చేపట్టాలి

ఎంసిపిఐ(యు) ముగింపు శిక్షణ తరగతుల్లో జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్

నర్సంపేట,నేటిధాత్రి:

వినాశనకర విధానాలకు వ్యతిరేకంగా వర్గ సామాజిక జమిలి పోరాటాలే ప్రత్యామ్నాయమని ఆ దిశలో ఉద్యమాలను నిర్మించాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ పిలుపునిచ్చారు. దుగ్గొండి మండలంలోని గిర్నిబావిలో
ఎంసిపిఐయు రాష్ట్రస్థాయి సైద్ధాంతిక రాజకీయ శిక్షణా తరగతులకు ముగింపులో భాగంగా వర్గాలు వర్గ పోరాటాలు సామాజిక న్యాయం అనే అంశంపై పార్టీ జిల్లా కార్యదర్శి ప్రసంగిస్తూ సమాజ చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్ర అని పార్టీ కార్యకర్తలు వర్గ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని పెట్టుబడిదారీ దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక కర్షక కూలి వర్గాలను కూడగట్టి వర్గ పోరాటాలను ఉదృతం చేయాలని కోరారు.

కార్పొరేట్ శక్తులు పెట్టుబడుదారులు దోపిడిని విస్తృతం చేసి సంపదను పెంచుకుంటున్నారని వారికి అనుకూలంగా పాలకులు చట్టాలను మారుస్తున్నారని ఈ క్రమంలో ఆర్థిక అంతరాలు పెరిగిపోయి ఎంత శ్రమించినా కనీస అవసరాలు తీరలేని పరిస్థితికి దారితీస్తుందని ఇలాంటి పరిస్థితుల్లో మార్క్సిజం చెప్పినట్లు దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గ నాయకత్వంలో శ్రామికులు ఐక్యం కాక తప్పదని అందుకు పార్టీ నాయకత్వం కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కృషి చేయాలని కోరారు. కులం మతం ప్రాంతం పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజలందరికీ చెందాల్సిన సంపదను దోపిడీ చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరంతర కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. వర్గ సామాజిక ఐక్యతను పెంపొందిస్తూ వర్గ పోరాటాలను జయప్రదం కోరారు.

ఈ శిక్షణ తరగతులకు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు వంగాల రాగసుధ ప్రిన్సిపాల్ గా వ్యవహరించగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి పార్టీ కార్యక్రమం నిబంధనవళి భవిష్యత్తు కర్తవ్యాలను వివరించారు.ఈ శిక్షణ తరగతులకు వివిధ జిల్లాల నాయకత్వంతో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వల్లెపు ఉపేందర్ రెడ్డి, వనం సుధాకర్ కుంభం సుకన్య ఎన్ రెడ్డి హంసారెడ్డి మంద రవి రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబా బాబురావు గుండెబోయిన చంద్రయ్య తుడుం అనిల్ కుమార్ నర్ర ప్రతాప్ కర్ర రాజిరెడ్డి నీల రవీందర్ జబ్బర్ నాయక్ కంచ వెంకన్న కనకం సంధ్య గడ్డం నాగార్జున మాస్ సావిత్రి కర్ర దానయ్య మాలోత్ సాగర్ సుంచు జగదీశ్వర్ ముక్కెర రామస్వామి వివిధ జిల్లాల కార్యదర్శులు డివిజన్ మండల కార్యదర్శి మహమ్మద్ రజాసాహెబ్ సింగతి మల్లికార్జున్ స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version