కొమ్మాల జాతర ప్రాశస్త్యాన్ని ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు

కొమ్మాల జాతర ప్రాశస్త్యాన్ని ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు

కొమ్మాల జాతర బ్రహ్మోత్సవాలపై కలెక్టర్ సమీక్ష

మార్చి 3 నుంచి 8 వరకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద..

నర్సంపేట,నేటిధాత్రి:

కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జాతర ప్రాశస్త్యాన్ని ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు జిల్లా పౌర సంబంధాల శాఖతో సమన్వయం చేసుకుని ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆలయ కార్యనిర్వాహక అధికారిని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు.వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల గ్రామంలో నిర్వహిస్తూన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద కలెక్టరేట్ లో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గీసుకొండ మండలం కొమ్మాల గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మార్చి 3 నుంచి మార్చి 8 వరకు వైభవంగా నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.పోలీస్, ఆరోగ్య, రెవెన్యూ, ఆర్టీసీ, విద్యుత్, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, జిల్లా పంచాయతీ, పౌర సంబంధాల, అగ్నిమాపక తదితర శాఖలు సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధంచేసి పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు.జాతర సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో విద్యుత్ అలంకరణలు, చలువ పందిళ్లు, క్యూ లైన్లు, త్రాగునీటి సదుపాయం, అన్నదాన కార్యక్రమాలు, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సదుపాయాలు, వైద్య శిబిరాలు, శానిటేషన్ చర్యలు సమర్థంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
జాతర ప్రాశస్త్యాన్ని ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు జిల్లా పౌర సంబంధాల శాఖతో సమన్వయం చేసుకుని ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆలయ కార్యనిర్వాహక అధికారిని సూచించారు.సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రామ్ రెడ్డి, ఆర్డీవో సుమ, గీసుకొండ తహసీల్దార్ రియాజుద్దీన్,సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

కేతకి సంగమేశ్వర స్వామి జాతరకు ముస్తాబు…

కేతకి సంగమేశ్వర స్వామి జాతరకు ముస్తాబు

◆-: హర హర మహాదేవ… శంభో శంకర

◆-: శివయ్యని బ్రహ్మదేవుడే మొగలి పువ్వులతో పూజించిన క్షేత్రం

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం: మహాశివరాత్రి ఉత్సవాలకు జిల్లాలోని శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. అష్ట తీర్థాల సంగమం, తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాలలో ప్రసిద్ధిగాంచిన ఝరాసంగం శ్రీ పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి దేవాలయంలో నవాహ్నిక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. రహదారులలో రంగురంగుల దీపాలను, తోరణాలను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక నుండి వచ్చే భక్తుల కోసం తాత్కాలిక రోడ్ల మరమ్మతు చేశారు. కలెక్టర్ శరత్ పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే పలు దఫాల అధికారులతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేశారు. భక్తుల కోసం మంచినీటి సౌకర్యం, చలువ పందిళ్లు, ప్రత్యేక స్నానపు గదులు, మొబైల్ టాయిలెట్స్, ప్రత్యేక సీసీ కెమెరాలతో పాటు భద్రత, ఆలయ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాట్లు చేశారు. కాగా స్వామివారి గర్భాలయాన్ని బంగారు పూతతో మకర తోరణం చేయించారు.

సంగమేశ్వర స్వామి స్థల పురాణం:

ఝరాసంగ క్షేత్రంలో శివ లింగాన్ని సాక్షాత్తు బ్రహ్మదేవుడు ప్రతిష్టించినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా తెలుస్తోంది. కృత యుగంలో సూర్య వంశానికి చెందిన కుపేంద్ర అనే రాజు చర్మ వ్యాధితో బాధ పడుతూ ఉండేవాడు. తన వ్యాధి నివారణకు రాజు చేసిన ప్రయత్నం విఫలమయ్యింది. ఒకానొకప్పుడు రాజు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడున్న కేతకీ వనంలో ఉన్న నీటి గుండంలో స్నానం చేసినప్పుడు అతనికి పూర్తిగా స్వస్థత చేకూరిందట. అదేరోజు రాత్రి రాజుకి సంగమేశ్వర స్వామి కలలో కనిపించి తానక్కడ ఉన్నానని, దానిని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడట. పరమేశ్వరుని ఆదేశం మేరకు రాజు స్వామికి ఆలయాన్ని కట్టించాడట. అక్కడున్న నీటి కుండాన్ని పుష్కరిణిగా మార్చి దానికి అష్ట తీర్ధమని, అమృత కుండంగా పేరు పెట్టినట్లు ఇక్కడి ఆదారాల ద్వారా అవగతమవుతోంది. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి వారి దివ్య మంగళ లింగ రూపాన్ని దర్శించిన భక్తులు అపూర్వమైన ఆధ్యాత్మికానందానికి లోనవుతారు.

మంజీర నదీతీరంలో వెలసిన ఈ స్వామిని సంగమేశ్వర స్వామి అని పిలుస్తారు. కేతకీ సంగమేశ్వర స్వామిగా పూజలందుకుంటున్న ఈ స్వామిని మొదట బ్రహ్మదేవుడు కేతకీ పుష్పాలతో కేతకి అంటే మొగలి పువ్వులతో పూజించాడట. అందుకనే ఈ స్వామిని కేతకీ సంగమేశ్వర స్వామి అని కొలుస్తున్నారు భక్తులు అని శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది.

11/02/2026 బుధవారం నాడు కేతకీ నహ్వానిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

స్వామివారి కార్యక్రమాలు ఇలా ఉన్నాయి

14/02/2026 శనివారం నాడు శేష వాహన సేవ నిర్వహించనున్నారు.

తేదీ 15/02/2026 ఆదివారం నాడు మహాశివరాత్రి సందర్భంగా రాత్రి 12 గంటల నుండి స్వామివారికి లింగోద్భవ సమయమున స్వామివారికి మహన్యాస రుద్రాభిషేకము.

16/02/2026 సోమవారం నాడు మహా రుద్రాభిషేకం, నంది వాహన సేవ,

17/02/2026 మంగళవారం నాడు ఉదయం తెల్లవారుజామున అగ్నిగుండ ప్రవేశం,

సాయంత్రం;5;30 నిమిషాలకు శివపార్వతుల కళ్యాణోత్సవం, రాత్రి 10 గంటలకు రథోత్సవం. తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

మహాశివరాత్రికి ఏర్పాట్లు పూర్తి: ఆలయ ఈవో శివ రుద్రప్ప

కేతకి ఆలయ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈవో శివ రుద్రప్ప పేర్కొన్నారు. గతంలో కంటే అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంటుందని అందుకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. భక్తుల సహకారంతో బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామన్నారు. రేపటి మహాశివరాత్రి జాగరణ కోసం ఇప్పటికే పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు.

తిరుమలనాథ స్వామి హుండీ లెక్కింపు

తిరుమలనాథ స్వామి హుండీ లెక్కింపు

నిజాంపేట: నేటి ధాత్రి

శ్రీ తిరుమల స్వామి బ్రహ్మోత్సవాలు గత కొన్ని రోజుల క్రితం ఘనంగా నిర్వహించారు. నిజాంపేట మండలం చల్మెడ శివారులో గల తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వాహకులు ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నెలరోజులు, బ్రహ్మోత్సవాలతో కలిపి మొత్తం హుండీ ఆదాయం 84,709 వచ్చినట్లు తెలిపారు. ఈ ఆదాయాన్ని బ్యాంకులో జమ చేయనున్నట్లు చైర్మన్ అక్క పల్లి రామిరెడ్డి, ఈవో రవికుమార్ తెలిపారు. డిప్యూటీ తహసిల్దార్ రమ్యశ్రీ, సీనియర్ అసిస్టెంట్ రమేష్, డైరెక్టర్ బాజా రమేష్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించాలి…

బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం: అష్టతీర్థాల నిలయంగా, దక్షిణ కాశీగా పేరుగాంచిన ఝరాసంగం మండలంలోని కేతకి సంగమేశ్వర స్వామి మహాశివరాత్రి నవాహ్నిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశాల మేరకు సంగారెడ్డి జడ్పీ సీఈవో జానకిరామ్, జహీరాబాద్ ఆర్డీఓ దేవుజా అధికారులను ఫిబ్రవరి 12 నుంచి 20 వరకు జరగనున్న ఉత్సవాల ఏర్పాట్లపై శనివారం ఎంపీడీవో సమావేశం మందిరంలో దేవస్థానం కార్యనిర్వహణ అధికారి శివరుద్రప్ప, జహీరాబాద్ డీఎస్పీ సైదా పలు శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ సరఫరా, రవాణా సౌకర్యాలు, ఆర్టీసీ, సంస్కృతిక, వైద్యం, ఐసిడిఎస్, సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. జాతర ముగిసే వరకు అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. మహిళా భక్తులకు ప్రత్యేకంగా అధిక సంఖ్యలో తాత్కాలిక టాయిలెట్లు, స్నానాలకు అవసరమైనన్ని షవర్లు, మంచినీటి సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులతో కలిపి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. అధికారులందరూ భక్తి భావంతో సేవనందించాలన్నారు. దేవస్థానం వరకు వెళ్లే కనెక్టివ్ రోడ్లను మరమ్మతులు చేయించి గుంతలు పూడ్చాలని, అవసరమైన చోట సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, 108 అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచాలని తెలిపారు. అగ్నిప్రమాదాల నివారణకు దేవస్థానం పరిసరాల్లో అగ్నిమాపక పరికరాలు, సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని సూచించారు. భద్రతా పరంగా గుడి లోపల, బయట, ఆవరణలో, పార్కింగ్ ప్రాంతాల్లో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, సమావేశం అనంతరం అధికారులతో కలిసి ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ డిఎల్పిఓ అమృత, తహసిల్దార్ భాస్కర్, ఎంపీడీవో మంజుల, సీఐ హనుమంతు మండల వైద్యాధికారి రమ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు,

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version