మున్సిపాలిటీ గద్దె పై గులాబీ జెండా ఎగిరేస్తాం…
16,20 వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థులు నాని, మంద వేణుగోపాల్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
క్యాతనపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్ ఎన్నికల బరిలో 16 వ వార్డ్ అభ్యర్థిగా జి కృపానందం(గ్యాస్ నాని),20 వ వార్డ్ బరిలో మంద వేణుగోపాల్ లు ఉన్నారు.స్థానికంగా బిఆర్ఎస్ పార్టీ కి ఎక్కువ ఓటు బ్యాంక్ ఉన్న నేపధ్యంలో ఇక్కడ మున్సిపాలిటీ గద్దె పై గులాబీ జెండా ఎగిరేస్తాం అని అభ్యర్ధులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బారాస,సిపిఐ పార్టీ కలిసి మునిసిపాలిటీలో పోటీ చేస్తున్న నేపథ్యంలో ప్రచారంలో సైతం ముందు నిలుస్తున్నారు.తమను గెలిపిస్తే వార్డులలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తమ పై పెట్టుకున్నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి పార్టీని గెలిపించేందుకు కృషి చేస్తామని కౌన్సిలర్ అభ్యర్థులు నాని, మంద వేణుగోపాల్ లు అంటున్నారు.
