ఏబిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్డీవోకు వినతి పత్రం

 

ఏబిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్డీవోకు వినతి పత్రం

నర్సంపేట,నేటిధాత్రి:

హాస్టల్ బిల్లులు విడుదల చేయాలని ఏబిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్డీవో ఉమారాణికి వినతిపత్రం అందజేశారు.
అనంతరం జిల్లా కార్యదర్శి బొట్ల నరేష్ మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ,బీసీ సంక్షేమ హాస్టల్లో గత జనవరి నుండి నేటి వరకు ఎస్సీ ఎస్టీ హాస్టల్ డైట్ బిల్స్, రాలేకపోవడంతో హాస్టల్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతూ హాస్టల్లో ఉండని పరిస్థితి నెలకొందన్నారు.ఎస్సీ ఎస్టీ బీసీ కళాశాల హాస్టల్లో సొంతభవనాలకు లేకపోవడం అరకొర వసతులతో వలన అద్దె భవనంలో మధ్యలో ఉంటూ కాలంవెల్లదీసే పరిస్థితి నెలకొందన్నారు. అధికారులు స్పందించి హాస్టల్ డైట్ బిల్లులు, అద్దె భవనాలకు కిరాయిలు చెల్లించి,హాస్టల్లో ఉన్న నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఆర్డీఓను కోరినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రశాంత్ ,వినయ్, శ్రీకాంత్, రాకేష్, ప్రమోద్, కుమార్, తేజ, వంశీ, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version