నర్సంపేట మహిళ కారాగారంలో వైద్య శిబిరం…

నర్సంపేట మహిళ కారాగారంలో వైద్య శిబిరం

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణంలోని వరంగల్ జిల్లా నర్సంపేట పట్టంలోని మహిళా ప్రత్యేక కారాగారంలో ఉచిత వైద్య శిబిరం సబ్ జైలు సూపరింటెండెంట్ కె.స్రవంతి ఆధ్వర్యంలో చేపట్టారు.కారాగారంలో శిక్షలు అనుభవిస్తున్న,రిమాండ్ మహిళ ఖైదీలకు,జైలు సిబ్బందికి వైద్య పరీక్షలు, నిర్వహించారు.అలాగే రక్త పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జైలు సూపరింటెండెంట్ కె.స్రవంతి మాట్లాడుతూ కారాగారంలో ఉన్న వివిధ రకాల గల ఖైదీలకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.బీపీ,షుగర్,ఇతర రక్త పరీక్షలు చేసి మందులు పంపిణీ చేస్తున్నట్లు సూపరింటెండెంట్ కె.స్రవంతి తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్యురాలు డాక్టర్ భావన,ల్యాబ్ టెక్నీషన్ నవీన్,సూపర్వైజర్ పుండరీబాయి,హెల్త్ సూపర్వైజర్ రామలింగయ్య,జైలు సిబ్బంది ,ఖైదీలు పాల్గొన్నారు.

పిల్లలలో రక్తహీనతను గుర్తించండి…

పిల్లలలో రక్తహీనతను గుర్తించండి

సరియైన మందులను ఇవ్వాలి డాక్టర్ రవి

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో అంగన్వాడి సూపర్వైజర్ అరుణ రజిత కిషోర్ బాల సురక్షన్ వారి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు రక్తహీనత టెస్టులు చేయించడం జరిగింది ఈ కార్యక్రమానికి డాక్టర్ రవి మెడికల్ ఆఫీసర్ రోజా హాజరైనారు అనంతరం విద్యార్థులకు బ్లడ్ టెస్ట్ చేసి రక్తహీనత ఉన్న విద్యార్థులకు వెంటనే మందులను ఇవ్వడం జరిగింది. బ్లడ్ తక్కువ ఉన్న విద్యార్థులకు తగిన సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ పాఠశాల టీచర్స్ ఆశా వర్కర్స్ విద్యార్థులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version