తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక.. ఉద్రిక్తం…

తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక.. ఉద్రిక్తం

 

తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికలో టెన్షన్ నెలకొంది. భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. తొర్రూర్ మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉన్నాయి.

తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. తొర్రూర్ మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉన్నాయి. ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 18 ఓట్లు ఉంటాయి. చైర్మన్ ఎన్నికకు మేజిక్ ఫిగర్ 10 ఓట్లు అవసరం. తాజా మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రకారం బీఆర్ఎస్‌కు 9 వార్డులు, కాంగ్రెస్‌కు 7 వార్డులు దక్కాయి. అయితే ఎమ్మెల్యే, ఎంపీల ఎక్స్ అఫీషియో ఓట్లతో కాంగ్రెస్ బలం 9కి చేరింది. దీంతో రెండు పార్టీల మధ్య గట్టి పోటీ ఏర్పడింది.
బీఆర్ఎస్ నుంచి ఇద్దరు వార్డు కౌన్సిలర్లు పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీన్ని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ జనసమీకరణ వ్యూహం అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో చైర్మన్ ఎన్నిక సమయంలో రెండు పార్టీల మధ్య ఉద్రిక్తత తీవ్రమైంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు భారీగా మోహరించారు. ప్రస్తుతం ఉద్రిక్తత కొనసాగుతోంది. ఎన్నికల ప్రక్రియ సాఫీగా జరిగేలా అధికారులు, పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఒకటవ వార్డు సేవకు సిద్ధం: కృష్ణారెడ్డి

ఒకటవ నంబర్ వార్డు నుంచి మున్సిపల్ కౌన్సిలర్‌గా అవకాశం కల్పిస్తే ప్రజలను సేవలు అందిస్తా

జహీరాబాద్ నేటి ధాత్రి:

భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తానని విద్యావేత్త కృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
సబ్ వెడ్డింగ్ 24/7 ప్రజాసేవ ప్రజల్లో ఉంటానని అన్నారు తాను గత 30 సంవత్సరాలుగా విద్యా రంగంలో సేవలందిస్తూ వేలాది మంది విద్యార్థులకు పాఠాలు చెప్పి వారిని ఉన్నత స్థాయికి చేర్చానని, విద్య ద్వారానే సమాజ మార్పు సాధ్యమని నమ్ముతూ నిరంతరం కృషి చేస్తున్నానని తెలిపారు. వార్డు అభివృద్ధి, విద్యా సౌకర్యాల విస్తరణ, యువతకు ఉపాధి అవకాశాలు, మౌలిక వసతుల మెరుగుదల లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో పాటు పార్టీ పెద్దలు అవకాశం ఇస్తే బాధ్యతాయుతంగా సేవ చేసి వార్డును ఆదర్శంగా నిలుపుతానని కృష్ణారెడ్డి అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version