ఘనంగా బిజెపి వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు.
కల్వకుర్తి/ నేటి ధాత్రి :
భారతీయ జనతా పార్టీ 47వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సోమవారం నాడు కల్వకుర్తి బిజెపి పార్టీ కార్యాలయం పైన బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్దారి పర్వతాలు పార్టీ జెండా ను ఆవిష్కరిoచారు.
పట్టణంలోని పలు వార్డులలో బిజెపి బూత్ అధ్యక్షులు జెండాను ఆవిష్కరించారు.పార్టీకార్యాలయం, బూత్ ల వారిగా జరిగిన జెండా ఆవిష్కరణలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గాప్రసాద్,జిల్లా ఉపాధ్యక్షులు మున్సిపల్ కౌన్సిలర్ బోడ నరసింహ, జిల్లా కార్యదర్శి గుర్రాల రాంభూపాల్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ లు రామకృష్ణ, శ్రీరాములు,సీనియర్
నాయకులు నీరుకంటి రాఘవేందర్ గౌడ్, నారెడ్ల శేఖర్ రెడ్డి, కృష్ణ గౌడ్, పాలకూర్ల రవి గౌడ్, గంగాధర్, వంశీ నాయక్, పెద్దారి విజయ్, ధన్నోజు నరేష్ చారి, కుడుముల రాంరెడ్డి,,శివాజీ, లక్ష్మీనరసింహ, అరవింద్ రెడ్డి, కూన ప్రవీణ్, వెంకటేష్, కిరణ్ యాదవ్,శివకుమార్, రాఘవేందర్ సాగర్, హనుమంతు గౌడు,మణికంఠ గౌడ్,శేఖర్, శ్రీకాంత్,రమేష్, పట్టణ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.పార్టీ స్థాపకులకు, మహానేతలకు ఘన నివాళులు అర్పించారు. ప్రతి కార్యకర్త పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిస్తూ, దేశ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీ మరింత బలపడాలని ఆకాంక్షించారు.భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6న స్థాపించబడినప్పటి నుండి సాధారణ కార్యకర్తల శక్తితో ఎదుగుతూ దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా అవతరించింది. ప్రారంభ దశలో కేవలం 2 ఎంపీ స్థానాలతో ప్రారంభమైన ఈ పార్టీ, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటూ క్రమంగా తన బలాన్ని పెంచుకుంది.అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తన సత్తాను చాటుకున్న బీజేపీ, అనంతరం నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా అఖండ విజయాలను సాధిస్తూ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దేశ అభివృద్ధికి కొత్త దిశను చూపుతోందన్నారు.
