పశువులకు గాలికుంటు వ్యాధి నివారణకు చర్యలు…

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణకు చర్యలు

సర్పంచ్ సుందిళ్ల రాజేశ్వరి

జైపూర్,నేటి ధాత్రి:

 

జైపూర్ మండలం గంగిపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ సుందిళ్ల రాజేశ్వరి నేతృత్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ప్రారంభించినట్లు తెలిపారు.మంగళవారం గ్రామంలోని 270 పశువులకు పశు వైద్యులు టీకాలు వేశారు.ఈ సందర్భంగా పశు వైద్యులు వెంకటేష్ మాట్లాడుతూ.. పశువులలో నోటి,కాళ్లలో పుండ్లు,జ్వరం,మేత తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయని ఇది అంటూ వ్యాధి పాల ఉత్పత్తి కూడా 50% వరకు తగ్గుతుందని అన్నారు.పశువుల వ్యాధి నివారణ కొరకు ప్రభుత్వం సంవత్సరానికి రెండుసార్లు అంటే 6 నెలలకు ఒకసారి టీకాలు వేస్తుందని తెలిపారు.నాలుగు నెలల పైబడిన పశువులకు టీకాలు వేపించాలని,టీకాలు వేపించడం వల్ల పశువుల ఆరోగ్యం మెరుగుపడి పాల ఉత్పత్తి పెరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుందిళ్ల రాజేశ్వరి, పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ,పశు వైద్యులు వెంకటేష్,సిబ్బంది శృతి, మహబూబ్ అలీ,ప్రభాకర్, రైతులు సుందిళ్ల లచ్చయ్య, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

న్యాల్కల్ లో పశు వైద్య సంరక్షణ కార్యక్రమం: రైతులకు సూచనలు…

న్యాల్కల్ లో పశు వైద్య సంరక్షణ కార్యక్రమం: రైతులకు సూచనలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండలం రామతీర్థం గ్రామంలో పశు వైద్య సంరక్షణ కార్యక్రమం నిర్వహించారు. పశు వైద్యుడు డాక్టర్ గణేష్ పశువులకు వైద్య పరీక్షలు చేసి, మందులు అందించి, రైతులకు సంరక్షణపై సూచనలు చేశారు. గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ లక్ష్మమ్మ మాట్లాడుతూ, పశువుల ఆరోగ్యం మెరుగుపడితే రైతుల ఆర్థిక స్థితి బలపడుతుందని, ఇలాంటి కార్యక్రమాలు తరచుగా జరగాలని తెలిపారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సేవలు పొందారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version