పశువులకు గాలికుంటు వ్యాధి నివారణకు చర్యలు
సర్పంచ్ సుందిళ్ల రాజేశ్వరి
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ మండలం గంగిపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ సుందిళ్ల రాజేశ్వరి నేతృత్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ప్రారంభించినట్లు తెలిపారు.మంగళవారం గ్రామంలోని 270 పశువులకు పశు వైద్యులు టీకాలు వేశారు.ఈ సందర్భంగా పశు వైద్యులు వెంకటేష్ మాట్లాడుతూ.. పశువులలో నోటి,కాళ్లలో పుండ్లు,జ్వరం,మేత తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయని ఇది అంటూ వ్యాధి పాల ఉత్పత్తి కూడా 50% వరకు తగ్గుతుందని అన్నారు.పశువుల వ్యాధి నివారణ కొరకు ప్రభుత్వం సంవత్సరానికి రెండుసార్లు అంటే 6 నెలలకు ఒకసారి టీకాలు వేస్తుందని తెలిపారు.నాలుగు నెలల పైబడిన పశువులకు టీకాలు వేపించాలని,టీకాలు వేపించడం వల్ల పశువుల ఆరోగ్యం మెరుగుపడి పాల ఉత్పత్తి పెరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుందిళ్ల రాజేశ్వరి, పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ,పశు వైద్యులు వెంకటేష్,సిబ్బంది శృతి, మహబూబ్ అలీ,ప్రభాకర్, రైతులు సుందిళ్ల లచ్చయ్య, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
