పరకాలలో ఏఐసీసీటీయూ నిరసన ర్యాలీ..

పరకాలలో ఏఐసీసీటీయూ నిరసన ర్యాలీ

పరకాల,నేటిధాత్రి

 

సార్వత్రిక జాతీయ సమ్మెను విజయవంతం చేయాలనే ఉద్దేశంతో పరకాలలో ఏఐసీసీటీయూ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీలో తెలంగాణ వ్యవసాయ మార్కెట్ అనుబంధ సంస్థ హమాలి యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్లు కార్మిక వ్యతిరేకమని,అవి అమలైతే కార్మికుల హక్కులు దెబ్బతింటాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.తమ డిమాండ్లు నెరవేరకపోతే పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.ఈ ర్యాలీలో ఏఐసీసీటీయూ తో పాటు ఏఐటియుసి అనుబంధ సంస్థ హమాలి యూనియన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మెను విజయవంతం చేశారు. బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు వివరించారు. కష్టపడి పనిచేసే కార్మికుల జీవితం ఎలా దుర్బరంగా మారుతోందో తెలియజేస్తూ సమ్మెలో పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లు కార్మికుల జీవనాధారాన్ని దెబ్బతీస్తాయని పేర్కొంటూ, వాటిని వెంటనే రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.లేదంటే పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తామని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కార్మికుల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version