భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి- కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్..

భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి- కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) ఆధ్వర్యంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడే, ఏఎల్ఓ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రఫీకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈసందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్ మాట్లాడుతూ ఇన్సూరెన్స్లను ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చే ఆలోచనను ప్రభుత్వం మానుకోవాలని, సెస్సు రెండు పర్సెంట్ పెంచాలని, సహజ మరణం కింద ఇచ్చే డబ్బులను ఐదు లక్షలకు పెంచాలని, డెలివరీ పెండ్లి కానుక లక్ష రూపాయలు ఇవ్వాలన్నారు. సిఎస్సి హెల్త్ టెస్టులను వెంటనే రద్దు చేయాలని జీవో నెంబర్ 12 ను సవరించి వెల్ఫేర్ బోర్డు ద్వారానే కార్మికులకు ప్రభుత్వమే సంక్షేమ పథకాలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల అందరికీ హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని, అక్రమంగా వెల్ఫేర్ బోర్డు నిధులు మూడు వందల నలభై ఆరు కోట్లు ప్రైవేటు భీమా కంపెనీలకు ఇచ్చిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వెల్ఫేర్ బోర్డులో పెండింగ్ క్లేము లకు వెంటనే నిధులు విడుదల చేసి అరవై సంవత్సరాలు పైబడిన కార్మికునికి పెన్షన్ వెంటనే ఇవ్వాలన్నారు. తెలంగాణ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు గందె కొమురయ్య మాట్లాడుతూ వెల్ఫేర్ బోర్డు అడ్వైజర్ కమిటీని వెంటనే నియమించి 2009 నుండి రెన్యువల్ కానీ పన్నేండు లక్షలకు పైగా ఉన్నా లేబర్ కార్డులను యుద్ధ ప్రాతిపదికన వెంటనే రెన్యువల్ చేయాలని పేర్కొన్నారు. కార్మిక శాఖలో ఓబీసీకి ప్రత్యేకంగా యంత్రాంగాన్ని నియమించాలని కార్మికశాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మీసేవలో అధిక డబ్బులు వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణాల్లో ఉన్న లేబర్ అడ్డాల వద్ద తాగునీరు, మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని గందే కొమురయ్య ప్రభుత్వాన్ని కోరారు. ఈకార్యక్రమంలో తెలంగాణ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా కౌన్సిల్ సభ్యులు రేగుల కుమార్, గామినేని సత్యం, పుట్ట మహేష్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version