పరామర్శ – గాయపడిన గీత కార్మికుడు ఎర్ర తిరుపతిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్…

పరామర్శ – గాయపడిన గీత కార్మికుడు ఎర్ర తిరుపతిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్

మొగుళ్లపల్లి మండల టిఆర్పిఅధ్యక్షుడు బోనగిరి రాజేష్

మొగుళ్ళపల్లి నేటి దాత్రి జయశంకర్

భూపాలపల్లి జిల్లా, మొగుళ్ళపల్లి మండలం, పర్లపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు ఎర్ర తిరుపతి (40) తాటి చెట్టు దిగుతున్న సమయంలో మోకుజారి కిందపడడంతో తీవ్ర గాయాలకు గురయ్యాడు.

తక్షణమే అతన్ని చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ప్రాథమిక చికిత్స అందించారు. తరువాత మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
గాయపడిన తిరుపతిని పరామర్శించిన టిఆర్పి మొగుళ్ళపల్లి మండల అధ్యక్షులు బోనగిరి రాజేష్, పర్లపల్లి గ్రామ యువజన అధ్యక్షుడు కాశెట్టి రాజేష్ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం ఇచ్చారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిరుపేద కుటుంబానికి చెందిన తిరుపతిని ప్రభుత్వం తక్షణమే ఆర్థికంగా ఆదుకోవాలని, పూర్తి వైద్య ఖర్చులు భరించాలని డిమాండ్ చేశారు. అలాగే, గీత కార్మికుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

జైపూర్,నేటి ధాత్రి:

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మంచిర్యాల పోలీస్ వారు తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జైపూర్ మండలం కాన్కూర్ గ్రామానికి చెందిన యాదన వేన తిరుపతి (42) తన భార్య శ్రీలత ఇద్దరు కుమారులతో మంచిర్యాలలో నివాసం ఉంటూ నస్పూర్ లో హమాల్ పని పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. శనివారం సాయంత్రం నస్పూర్ లో పని ముగించుకుని మంచిర్యాలకు వెళుతున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.మంగళవారం పోస్టుమార్టం నిర్వహించి డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు.మంచిర్యాల పోలీస్ వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version