న్యాలకల్ అభివృద్ధికి రూ.50 లక్షలు మంజూరు…

న్యాలకల్ అభివృద్ధికి రూ.50 లక్షలు మంజూరు

జహీరాబాద్ నేటి ధాత్రి:

న్యాల్కల్ మండల అభివృద్ధికి ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ రూ.50 లక్షలు మంజూరు చేశారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో న్యాల్కల్ ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధికి అదనంగా రూ.15 లక్షలు మంజూరయ్యాయని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి భాస్కర్ రెడ్డి సోమవారం తెలిపారు.2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ నిధులతో మండలంలోని గ్రామాల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువలు, వీధి దీపాలు, బోరు బావులు వంటి అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో పనులు త్వరలో ప్రారంభమవుతాయి. మొత్తం రూ.65 లక్షలు మంజూరు కావడంపై కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు హర్షం వ్యక్తం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version