`డ్రోన్ సర్వేతో ఇళ్లకు సరిహద్దుల నిర్ణయం
`అమలు చేస్తున్న కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ, సర్వేఆఫ్ ఇండియా
`డ్రోన్ల సహాయంతో సర్వే ఫలితాలు కచ్చితం
`కచ్చితమైన మార్కింగ్తో యాజమాన్య హక్కు పత్రాలు
`ఎన్నో సమస్యలకు పరిష్కారం
హైదరాబాద్,నేటిధాత్రి:
దేశవ్యాప్తంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివాస స్థలాల సరిహద్దు సమస్యలకు అద్భుతమైనపరిష్కారం చూపుతున్న పథకం ‘స్వామిత్వ’ (సర్వే ఆఫ్ విలేజ్ ఆబాదీ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజెస్). దీన్ని ప్రధాని నరేంద్రమోదీ 2020, ఏప్రిల్ 24న ప్రారంభించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల్లో అధికశాతం మందికి సరైన పత్రాలు లేకపోవడంతో, ఆక్రమణలకు పాల్పడ్డారంటూ వారి ఇళ్లను కూల్చివేసేందుకు కోర్టులు ఆదేశాలిస్తున్నాయి. తాతలు, తండ్రుల కాలంనుంచి నివాసముంటున్న తమకు ఇటువంటి దు స్థితేంటని ఆయా నివాసగృహాలకు యజమానులు లబోదిబోమనడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి వీరి నివేశనస్థలాల సర్వే చేసి అధికారిక పత్రాలను జారీచేయడం ఒక్కడే పరిష్కారమన్న నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో ప్రవేశపెట్టిన పథకమే ‘స్వామిత్వ’. ఈ పథకాన్ని కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ, సర్వేఆఫ్ ఇండియా (ఎస్ఓఐ)లు దేశవ్యాప్తంగా ఉమ్మడిగా అమలు చేస్తున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లోని గృహయజమానులకు సరైన పత్రాలు లేకపోవడంతో, ఇళ్ల సరిహద్దులు నిర్ధారించడం ఒక ప్రధాన సమస్య కాగా, వీరినుంచి శాస్త్రీయంగా పన్నువసూలు, గ్రామాల అభి వృద్ధి కార్యక్రమాల అమలుకు ప్రధాన అడ్డంకిగా మారింది. ఉదాహరణకు ఉత్తరాఖండ్లోని భీ మ్వాలా గ్రామానికి చెందిన వినోద్ అనే 21 సంవత్సరాల యువకుడికి రెండేళ్ల క్రితం వరకు తన నివేశన స్థలానికి సంబంధించి ప్రభుత్వంతో వివాదం నడిచింది. అతను నివసిస్తున్న ఇంటికి యాజమాన్య హక్కులను నిర్ధారించే పత్రాలేవీ లేకపోవడంతో ప్రభుత్వం దీన్ని అక్రమంగా ఆక్రమించి చేసిన నిర్మాణంగా పరిగణించి కూల్చివేయడానికి సిద్ధం కావడంతో వివాదం కోర్టుకు చే రింది. ఒకప క్క కోర్టు కేసు నడుస్తుండగానే 2023లో స్వామిత్వ పథకం కింద గ్రామాన్ని డ్రోన్ల ద్వారా సర్వే నిర్వహించారు. ఈ విధంగా నిక్కచ్చి సర్వే నిర్వహించి గ్రామస్థులకు యాజమా న్య హక్కుల పత్రాలను అందజేశారు. వినోద్ తండ్రి కూడా సరిగ్గా ఇదే సమస్యను ఎదుర్కొన్నారు. ఇప్పుడు డ్రోన్ సర్వే నిర్వహించిన తర్వాత అతని ఇంటిని కచ్చితమైన మార్కింగ్తో యాజమా న్య హక్కు పత్రాన్ని ప్రభుత్వం జారీచేసింది. దీన్ని ఉత్తరాఖండ్ హైకోర్టులో సమర్పించగానే, ఇంటిని కూల్చవద్దని ప్రభుత్వాధికార్లను ఆదేశించింది. స్వామిత్వ పథకం వల్ల కలిగే ప్రయోజనానికి ఇదొక ఉదాహరణ మాత్రమే!
నిజం చెప్పాలంటే ఇటువంటి భూవివాద కేసులో దేశవ్యాప్తంగా కోర్టుల్లో కుప్పలు తెప్పలుగా పేరుకుపోయి వుంటున్నాయి. ప్రపంచబ్యాంకు అధ్యయనం ప్రకారం భారత కోర్టుల్లో కేసులు పెద్ద ఎత్తున పెండిరగ్లో వుండటానికి భూవివాదాలే కారణమని స్పష్టం చేసింది. దేశంలో 66% సివిల్ కేసులు ఆస్తుల తగాదాలకు సంబంధించినవేనని సంస్థ పేర్కొంది. ఇటువంటి కేసులు పరిష్కారం కావడానికి కనీసం 20 ఏళ్లయినా పడుతోంది! అదీకాకుండా గతంలో సుప్రీకోర్టు ఇచ్చిన 25% తీర్పులు కేవలం భూవివాదాలకు సంబంధించినవే కావడం గమనార్హం. కోర్టులో ప్రస్తు తం పెండిరగ్లో వున్న ప్రతి మూడు కేసుల్లో రెండు ఆస్తి వివాదాలకు సంబంధించినవే కావడం గమనార్హం.
స్వామిత్వ పథకం కింద డ్రోన్ సర్వేల ఆధారంగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, కర్ణాటక,పంజాబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 5వేల గ్రామాల్లో ఇళ్లస్థలాల యాజమాన్య హక్కులకు సంబంధించిన సమస్యలకు పరిష్కారం లభించింది. నిజానికి 2020లో సర్వే ఆఫ్ ఇండియా మొట్టమొదటిసారి భూమి మ్యాపింగ్ కోసం డ్రోన్ల కొనుగోలు ప్రారంభించింది. ప్రస్తుతం సర్వే నిర్వహించడానికి మైక్రో డ్రోన్లు (250 గ్రాముల నుంచి 2 కిలోల వరకు బరువు) మరియు చిన్న డ్రోన్లు (2 కిలోల నుంచి 25 కిలోల బరువు) వాడుతున్నారు.
సర్వే ఏవిధంగా మొదలైంది?
నిజం చెప్పాలంటే మనదేశంలో భూ సర్వే నిర్వహించడం అత్యంత క్లిష్టమైన కార్యం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇది మరీ కష్టం. ఎందుకంటే ఎవరివద్దా ఎటువంటి పత్రాలు లేకపోవడం, సరైన రికార్డులు లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. బ్రిటిష్ వలస పాలనలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమకు అవసరమైన స్థలాన్ని ఎంపిక చేసుకొని అక్కడ ఇళ్లను ని ర్మించుకోవడం ఆనవాయితీగా వుండేది. వీటికి ఎటువంటి యాజమాన్య ధ్రువీకరణ పత్రాలు లేదా మరే ఇతర ఆధారాలు వుండేవి కావు. ఇటువంటి ఆవాస ప్రాంతాలను ‘ఆబాదీ’గా వ్యవహ రించేవారు. అ పేరునే ఇప్పటికీ వాడుతున్నారు. బ్రిటిష్ వారి కాలం లేదా స్వాతంత్య్రానంతర కాలంలో ఇటువంటి ఆవాసాల విషయంలో ఏవిధమైన సర్వే నిర్వహించలేదు. ఫలితంగా తరతరాలుగా ఏవిధమైన పత్రాలు లేకుండానే ఆయా గ్రామాల్లో ప్రజలు నివసిస్తూ వస్తున్నారు. కానీ రాను రాను పరిస్థితులు మారాయి. ఆయా గ్రామ పంచాయతీలకు ఇళ్ల పన్నులు వసూలు చేయ డం, సరిహద్దు నిర్ధారణ, ప్రభుత్వ స్థలాల ఆక్రమణకు సంబంధించిన వివాదాల పరిష్కారం పెద్ద సమస్యగా మారింది. వివాదాలు వచ్చినప్పుడు తరతరాలుగా నివసిస్తున్నప్పటికీ తమవద్ద ఎటు వంటి పత్రాలు లేకపోవడంతో ఆయా గృహ యజమానులు తీవ్ర సమస్యలు ఎదుర్కొనడం మొదలైంది. కొన్ని రాష్ట్రాల్లో భర్త చనిపోయిన మహిళకు తన భర్త వాటాను ఇవ్వకుండానే, వెళ్లగొట్టిన సంఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి.
మొట్టమొదటగా వున్న మహారాష్ట్రలోని కొన్ని గ్రామాల్లో నెలకొన్న ఈ సమస్యను పరిష్కరించడానికి 2019లో సర్వే ఆఫ్ ఇండియా ముందుకొచ్చింది. డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించిఈ గ్రామాల్లో ఇళ్లకు కచ్చితమైన సరిహద్దులను నిర్ణయించడంతో ఇంటిపన్ను వసూళ్లు, సరిహ ద్దు వివాదాలు పరిష్కారమయ్యాయి. ప్రధాని నరేంద్రమోదీ ఇటువంటి సమస్యలను పరిష్కరించే క్రమంలో మంత్రి మండలి సమావేశం ఏర్పాటు చేసినప్పుడు అప్పటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి మహారాష్ట్ర గ్రామాల్లో డ్రోన్ టెక్నాలజీ సహాయంతో సమస్యను పరిష్కరించిన విధాన్ని వివరించడంతో, నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ‘స్వామిత్వ’ పేరుతో పథకాన్ని అమల్లోకి తెచ్చారు. విశేషమేంటంటే 2020 సంవత్సరంలో ఏప్రిల్ 24వ తేదీన కోవిడ్ తీవ్రంగా వున్నప్పుడే దీన్ని ప్రారంభించడం విశేషం. అంతేకాదు అదే ఏడాది అక్టోబర్ నాటికి లక్ష ప్రాపర్టీ కార్డులు కూడా తయారయ్యాయి. 2025 ఏప్రిల్ నాటికి స్వామిత్వ పథకం ప్రారంభమై ఐదేళ్లు పూర్తయింది. మే మొదటివారం నాటికి దేశంలో ఈ పథకం కింద నోటిఫై అయిన 3.45లక్షల గ్రామాల్లో, 3.22 లక్షల గ్రామాల్లో సర్వే పూర్తయింది. సర్వే మొదలైన దగ్గరినుంచి ఇప్పటివరకు 10.46 కోట్ల ఇళ్ల స్థలాలను డిజిటల్ రూపంలో నమోదు చేసారు. 1.67 గ్రామాలకు సంబంధించి 2.54కోట్ల ప్రాపర్టీ కార్డులు కూడా తయారయ్యాయి.
మాన్యువల్ సర్వేలో పొరపాట్లు
భూమి సర్వేలో ఎంతో నైపుణ్యమున్న సర్వేయర్లను నియమించినా, పొరపాట్లు జరిగే అవకాశం ఎక్కువ. కొన్ని సందర్భాల్లో గ్రామీణ ప్రజలు సర్వేయర్లను అనుమతించని సందర్భాలు కూడా చాలానే వున్నాయి. అదీకాకుండా సర్వేలు నిర్వహించడానికి సుదీర్ఘ సమయం పట్టడం కూడా సం ప్రదాయ సర్వే విధానాలు పెద్దగా విశ్వసనీయతను పొందకపోవడానికి మరో కారణం. పోనీ ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా సర్వే నిర్వహించాలనుకున్న, అవి కిలోమీటర్ల మేర విస్తీర్ణంతో వుండటంతో సర్వే కచ్చితంగా సాధ్యంకాదు. ఈ ఫలితాలు గ్రామీణ భూకమతాలను నమోదు చేయడానికి సహకరించవు. ముఖ్యంగా ఇళ్ల స్థలాల సర్వేకు అసలు పనిచేయవు. వీటి సర్వేకు కొద్ది సెంటీమీటర్ల మీటర్ల తేడాతో కూడిన కచ్చితత్వం కావాలి. ఇవి ఉపగ్రహ చిత్రాల ద్వారా సాధ్యం కాదు. ఈ సమస్యను పరిష్కరించడానికే డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయడం మొదలు పెట్టారు.
డ్రోన్లతో ప్రయోజనం
ఉదాహరణకు కొన్ని రకాల డ్రోన్లు 35 నుంచి 45 నిముషాల కాలంలో ఒక చదరపు కిలోమీటరు విస్తీర్ణంలో సర్వే నిర్వహించగలవు. ఇదే సమయంలో 4.35 కిలోల బరువును కూడా మోయ గలవు. మరికొన్ని డ్రోన్లు 40 నిముషాల వ్యవధిలో 4 కిలోమీటర్లు, మరికొన్ని 60 నిముషాల వ్యవధిలో 5 కిలోమీటర్ల దూరం వరకు ఎగరగలుగుతాయి. సగటున 40 నిముషాల కాలంలో 1 చదరపు కిలోమీటరు సర్వే పూర్తి చేస్తాయి. మరి ఇదే ఒక చదరపు కిలోమీటరు విస్తీర్ణాన్ని 3`4 సభ్యులతో కూడిన బృందం సర్వే పూర్తి చేయడానికి 20 రోజులు పడుతుంది. అంతేకాదు పోస్ట్ ప్రాసెస్డ్ కైనమాటిక్స్ (పీపీకే) సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో సర్వేలో ఎటువంటి తేడా రాకుండా మరింత కచ్చితంగా వుండేలా చూస్తున్నారు. ఇదే సమయంలో 567 కంటిన్యూవస్ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేటస్ (సీఓఆర్ఎస్) స్టేషన్లను కూడా ఈ సర్వేలో భాగంగా నెలకొల్పారు. ఈ సీఓఆర్ఎస్ నెట్వర్క్ భూమిపై కచ్చితమైన ప్రదేశాల్లో మార్కింగ్ చేయడానికి ఉపయోగపడతా యి.
సర్వే కొనసాగే విధానం
ముందుగా రాష్ట్ర ప్రభుత్వాలు సర్వే ఆఫ్ ఇండియాతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకోవాలి. రాష్ట్ర చట్టాల పరిధిలో సర్వే చేయాల్సిన గ్రామాల జాబితాను సర్వే ఆఫ్ ఇండియా కు అందజేయాలి.
శిక్షణ పొందిన రెవెన్యూ అధికారులు మరియు గ్రామ పంచాయతీకి సర్వేకు సంబంధించిన సమాచారం అందిస్తారు.
సర్వే ఆఫ్ ఇండియా టీమ్లు, అవసరమైన సీఓఆర్ఎస్ మరియు గ్రౌండ్ కంట్రోలింగ్ పాయింట్లను ఎంపిక చేస్తాయి.
సర్వే చేయాల్సిన ప్రాంతాన్ని గ్రామసభలో నిర్ణయిస్తారు.
సర్వేకు ముందు గ్రామంలోని ఇళ్ల సరిహద్దులను తెల్లని గీతలతో మార్క్ చేస్తారు.
తర్వాత డ్రోన్లు సర్వే చేయాల్సిన ప్రదేశంపై ఎగిరి ఫోటోలు తీస్తాయి.
ఈ చిత్రాలను 5 సెంటీమీటర్ల కచ్చితత్వంతో ప్రాసెస్ చేస్తారు.
ఈ మ్యాప్లను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తారు. వీటి ఆధారంగా ప్రభుత్వం నిజమైన యజమానులను గుర్తించి, మరోసారి క్షేత్రస్థాయిలో నిర్ధారించుకుంటుంది.
ఆవిధంగా అప్డేట్ అయిన తర్వాత ఈ మ్యాప్లను సర్వే ఆఫ్ ఇండియాకు పంపుతారు.
తప్పులు సరిదిద్దిన తర్వాత యజమానులకు సంబంధించిన ప్రాపర్టీ కార్డులను తయారు చేస్తారు.
గ్రామాల్లో చేపట్టే ప్లానింగ్ తదితర అభివృద్ధి కార్యక్రమాలకు ఈ మ్యాప్లనే ఆధారంగా తీసుకుంటారు.
ఇప్పుడు దేశవ్యాప్తంగా నివేశన స్థలాల సర్వేలకు డిమాండ్ పెరగడంతో సర్వే ఆఫ్ ఇండియా డ్రోన్ల సేకరణకు టెండర్లను పిలిచింది. గతంలో టెండర్లు పిలిచినప్పుడు కేవలం మూడు డ్రోన్ కంపెనీలు మాత్రమే ముందుకు రాగా, తాజాగా పిలిచిన టెంటర్లలో 20 కంపెనీలు పాల్గనడం దేశంలో డ్రోన్ సర్వేకు పెరుగుతున్న ప్రాముఖ్యతకు నిదర్శనం. ‘స్వామిత్వ’ పథకాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వాలు, భూ సర్వేలో డ్రోన్లను ఉపయోగించడానికి ముందుకు రావ డం విశేషం. ఇదే సమయంటో పట్టణ ప్రాంతాల్లో భూ రికార్డులను అప్డేట్ చేయడానికి ‘నేషనల్ జియోస్పే షియల్ నాలెడ్జ్`బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హాబిటేషన్స్ (నక్షా)ను అమలు చేస్తున్నారు. ఉదాహరణకు బెంగళూరు నగరానికి సంబంధించి ‘డిజిటల్ ట్విన్’ను అభివృద్ధి పరు స్తున్నారు. నగరాభివృద్ధి ప్రణాళికను మరింత పకడ్బందీగా అమలు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.