అంత్యక్రియలకు అభిమన్యు రెడ్డి ఆర్థిక సాయం.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని ఫల్గుగుట్టతండా గ్రామ పంచాయతీలోని సీత్యనాయక్ తండాలో చాంధీ(50) అనారోగ్యంతో మరణించారు.
వారి మృతికి సంతాపం తెలిపిన బి ఆర్ ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి.
అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని అభిమన్యు యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రఘునందన్, సర్పంచ్ కవిత, రాంగోపాల్, నాన్ చెరువు తండా సర్పంచ్ గోరి, రవినాయక్, శ్రీను, బాలు, పాండు, రవి బి ఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.