మార్కండేయ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు

చందుర్తి, నేటిధాత్రి:

అల్పాయుష్కుడైన తనను 16 సంవత్సరాల వయసులోనే ఆ పరమేశ్వరుడు మరణం నుండి తప్పించాడని చాలా మంది నమ్ముతారు. అందుకే మార్కండేయ మహర్షి జయంతి పురస్కరించుకొని సోమవారం చందుర్తి మండలం మల్యాల గ్రామంలో పద్మశాలి కులస్తులు మార్కండేయ దేవాలయంలో మహా రుద్రాభిషేకం , అన్నదాన కార్యక్రమం మహా ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పద్మశాలి కులస్తులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా ఆలయంలో రుద్రాభిషేకం మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు మరియు పద్మశాలి కులస్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *