Soil Testing Guides Farmers
భూసార పరీక్షలే రైతుకు మార్గదర్శకం..!
జహీరాబాద్ నేటి దాత్రి:
ఝరాసంగం: ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకుని, వాటి ఫలితాల ఆధారంగా రసాయన ఎరువుల వినియోగం చేయాలని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ వ్యవసాయ సంచాలకులు బిక్షపతి, న్యాల్ కల్ మండల వ్యవసాయ అధికారి అభినాష్ వర్మ సూచించారు. బుధవారం ముంగి గ్రామ రైతు వేదికలో నిర్వహించిన “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” అనే కార్యక్రమంలో రైతులకు అవగాహన కల్పించారు. అనుమతి ఉన్న దుకాణాల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలని, నకిలీ పత్తి విత్తనాల విక్రయిస్తే కేసులు తప్పవని హెచ్చరించారు. నిషేధిత “హెచ్లో” పత్తి విత్తనాలను కొనొద్దని తెలిపారు. యూరియా కొనుగోలు కోసం యూరియా యాప్ తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డా. విజయకుమార్, విజయలక్ష్మి చెరకు సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ఏఈఓ లు సాయిలు, సన్నిధి రెడ్డి, సాయి కిరణ్ రెడ్డి, మాధవి, రమేష్ పాటిల్ వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.
