సింగరేణి మండల కేంద్రము యుసిసిఆర్ఐ ఎంఎల్ మేడే.

Mayday Mayday

సింగరేణి మండల కేంద్రము యుసిసిఆర్ఐ ఎంఎల్ మేడే జెండా ఆవిష్కరణ.

కారేపల్లి నేటి ధాత్రి :

 

ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యతా కేంద్రం(మార్క్సిస్టు-లెనినిస్టు)యు.సి.సి.ఆర్.ఐ(యం-యల్) పార్టీ ఆధ్వర్యంలో 139వ మేడే దీక్షా దినాన్ని ఘనంగా నిర్వహించటం జరిగింది. మేడే వారోత్సవాల్లో భాగంగా స్థానిక అంబేద్కర్ సెంటర్ నుండి ఊరేగింపుగా ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీలో కార్యకర్తలు నినాదాలు చేస్తూ మేడే వర్ధిల్లాలి ప్రపంచ కార్మికులారా ఏకం కండి.పోరాడే వానిదే ఎర్రజెండా మార్క్సిజం లెనినిజo మావో ఆలోచన విధానం వర్ధిల్లాలి అనే తదితర నినాదాలు చేశారు.
ఈ మేడే కార్యక్రమంలో గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ పోలెబోయిన ముత్తయ్య గారు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా శ్రమని నమ్ముకొని పోరాడి పని దినాలను తగ్గింపు కొరకు తమ హక్కులు సాదించుకొన్న కర్శకులకు కార్మికులకు 139వ మేడే విప్లవ శుభాకాంక్షలు తెలియజేసారు.కార్యక్రమంలో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ(ఓపిఢిఆర్) జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బాణాల లక్ష్మణా చారి మరియు కార్యకర్తలు కొమరం బీమ్ సెంటర్ లో ఎగరవేయడం జరిగింది.
ఈ మేడే వారోత్సవాల్లో నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొనగా నవోదయ సాంస్కృతిక సంస్థ కళాకారులు విప్లవ గేయాలు ఆలపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!