శ్రీశ్రీశ్రీ శివ కేశవ సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయ రజితోత్సవ వేడుకలు.
మందమర్రి నీటి ధాత్రి :
మందమర్రి పట్టణ అంగడి బజార్ లోని శ్రీశ్రీశ్రీ శివ కేశవ సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయ రజితోత్సవ వేడుకలు. మందమర్రి పట్టణంలోని అంగడి బజార్ లో గల శ్రీ శ్రీ శివ కేశవ సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయ 25వ వార్షికోత్సవ ఉత్సవాలను శుక్రవారం నుండి శనివారం వరకు అత్యంత వైభవంగ నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు దిలీప్ శుక్ల శర్మ తెలిపారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శ్రీ శ్రీ శ్రీ శివ కేశవ సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయం యొక్క 25 వార్షికోత్సవ వేడుకలను ఈ నెల 9వ తేదీ నుంచి పదవ తేదీ వరకు నిర్వహించడం జరిగిందని ప్రతిరోజు ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహిస్తూ అనంతరం మహా అన్నప్రసాద్ వితరణ నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈనాటి.

ఆలయ రజిత ఉత్సవ వేడుకలకు హాజరైన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన జరిగిందని అలాగే స్వామివారి కృపకు పాత్రులు అయ్యారని తెలిపారు