మెట్ పల్లి మే 10 నేటి ధాత్రి:
మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మాజీ మంత్రి స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు 5వ వర్ధంతి పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు చేతుల మీదుగా వ్యవసాయ మార్కెట్ అమాలి చాట జాడు కార్మికులకు మజ్జిగ పాకెట్లు కూల్ డ్రింక్ పాకెట్స్ పంపిణీ చేశారు అనంతరం జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ మా నాన్నమంత్రిగా ఉండగా కోరుట్ల నియోజకవర్గంలో అత్యధిక పనులు చేశారని పశు వైద్యశాల ఏర్పాట్లు చేశారని ఆయన కోరుట్ల నియోజకవర్గంలో అన్ని సదుపాయాలు కల్పించాలని ఆయన చేసిన అభివృద్ధి పనులే ఇప్పటికి నడుస్తున్నాయని అన్నారు .
ఈ కార్యక్రమంలో కొమిరెడ్డి విజయ్ జువ్వాడి చంద్రశేఖర రావు పట్టణ అధ్యక్షులు జెట్టి లింగం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి మెట్పల్లి మండల అధ్యక్షులు తిప్పిరెడ్డి అంజిరెడ్డి పట్టణ యూత్ అధ్యక్షులు జెట్టి లక్ష్మణ్ మాజీ జెడ్పిటిసి ఆకుల లింగారెడ్డి ఎర్రోళ్ల హనుమాన్లు యమ రాజయ్య జిల్లా సేవాదళ్ అధ్యక్షులు నాయిని సురేష్ తుమ్మలపల్లి రాంప్రసాద్ పూదారి నర్సాగౌడ్ మర్రి సహదేవ్ పిప్పిర రాజేష్ మోకిం షకీల్ లింగారెడ్డి బుర్ర మహేందర్ అన్నమయ్య నరేష్ జాకీర్ రమేష్ బత్తుల భరత్ పూదారి రాము పుల్ల రాజా గౌడ్ మహేందర్ యూట్యూబ్ రాజు తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.