పరకాలలో ఘనంగా సీనియర్ ఎన్టిఆర్ 29 వర్ధంతి

పరకాల నేటిధాత్రి
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిసందర్బంగా నియోజకవర్గం నాయకులు కందుకూరి నరేష్,టౌన్ అధ్యక్షులు చీదురాల రామన్న, ప్రధాన కార్యదర్శి శంకర్ ల ఆధ్వర్యంలో స్థానిక వెలమవాడలోని టీడీపీ గద్దె వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం నిరుపేదలకు పండ్లు పంపిణీ చేసారు.ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ఎస్సీ సెల్ కార్య నిర్వాహక కార్యదర్శి నల్ల రవి,ముక్కిరాల జనార్దన్ రావు,వల్లల హరీష్,దండుగుల అశోక్,ఎన్టీఆర్ అభిమాన సంఘం,తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!