Rudrabhishekam for Mahashivaratri in Ganapuram
మహాశివరాత్రి సందర్భంగా రామలింగేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకలు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన కాకతీయుల నాటి శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి ఆలయంలో శుక్రవారం ఆలయ అర్చకులు ముసునూరు నరేష్ ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈనెల 15 ఆదివారం మహాశివరాత్రి పర్వదినాన్ని పునరస్కరించుకొని రామాలయంలో కొలువుతీరిన శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి ఉదయం ఐదు గంటల నుండి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం ప్రత్యేక అర్చనలు అభిషేకాలు నిర్వహించబోతున్నామని ఆలయ కమిటీ అధ్యక్షులు తాళ్లపల్లి గోవర్ధన్ గౌడ్ తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బండారు శంకర్ మూలా శ్రీనివాస్ గౌడ్ బటిక స్వామి మాదాసు అర్జున్ మాదాసు మొగిలి బూర రాజగోపాల్ ఉయ్యాల బిక్షపతి దైవాల భద్రయ్య పాండవుల భద్రయ్య మోటుపోతుల రాజన్న గౌడ్ తదితర సభ్యులు భక్తులు పాల్గొన్నారు
