`సిఐడి విచారణ తప్పుల తడక అన రోహిణి యాజమాన్యం చెప్పినట్లేనా?
`సిఐడి విచారణ నివేదిక వివరాలు తెలియకుండానే చికిత్స పొందని వారిని యాజమాన్యం గుర్తించిందా?
`రోహిణి స్టాంపులు, తప్పుడు తయారు చేసిన వివరాలు ‘‘రోహిణి’’ ఎందుకు బైటపెట్టలేదు?
`వారిపై కేసులు ఎందుకు నమోదు చేయలేదు?
`‘‘సిఐడి’’ విచారణలో ఆ వివరాలు ఎందుకు వెల్లడిరచ లేదు?
`వెల్లడిరచినా ‘‘సిఐడి’’ రోహిణి పేరు జాబితాలో చేర్చిందా?
`హన్మకొండలో ఎన్నో ఆసుపత్రులుండగా ‘‘రోహిణి’’ పేరుతో మాత్రమే అక్రమాలు చేశారా?
`‘‘రోహిణి’’ ఆసుపత్రికి అనుకూలంగా ‘‘కోర్టు ఆర్డర్’’ కాపీ మీడియాకు ఎందుకు విడుదల చేయలేదు?
`ప్రభుత్వం జారీ చేసిన ‘‘జీవో’’, జాబితా మీడియాలో ప్రచురితం కోసమే విడుదల చేశారు.
`మీడియా తన కర్తవ్యాన్ని మాత్రమే నిర్వర్తించింది.
`మీడియాకు గడువు ఇచ్చే హక్కు ‘‘రోహిణి’’కి లేదు.
`ప్రభుత్వ ‘‘జీవో’’ ఆధారంగానే మీడియా వార్తలు రాసింది.
`‘‘రోహిణి’’ ఆసుపత్రి తప్పు చేయకపోయినా ‘‘సిఐడి’’ విచారణ తప్పని యాజమాన్యం చెబుతోంది!
`‘‘సిఐడి’’ వ్యవస్థనే ‘‘రోహిణి’’ యాజమాన్యం శంకిస్తోంది!
`తప్పు ‘‘సిఐడి’’ మీద నెట్టేసి ‘‘రోహిణి’’ తప్పించుకోవాలనుకుంటోంది!
`ఒక రకంగా ప్రభుత్వాన్నే లిరోహిణి’’ యాజమాన్యంసవాలు చేసినట్లైంది!
`మీడియా మీద తోసేస్తే సరిపోతుందా?
`మీడియా కోరుకునేది కూడా అదే నిజమేమిటో నిగ్గు తేలాలి?
హైదరాబాద్,నేటిధాత్రి:
‘‘రోహిణి ఆసుపత్రి’’ యాజమాన్యం నుంచి ప్రజలకు, పత్రికా విలేకరులకు స్పష్టీకరణ పేరుతో ఒక నోట్ విడుదల చేశారు.అందులో ఇటీవల కొన్ని డిజిటల్ పత్రికలు, యూట్యూబ్ ఛానల్స్ రోహిణి ఆసుపత్రి యాజమాన్యం మీద నిరాధారమైన ఆరోపణలు చేయడం జరిగిందన్నారు.ఇదే మాట మీద ఆసుపత్రి యాజమాన్యం నిలబడుతుందా అనేది స్పష్టం చేయాల్సిన అవసరం వుంది.మీడియాలో వచ్చినవి అబద్దాలు, ఆరోపణలు, వాస్తవ విరుద్దాలని రోహిణి ఆసుపత్రి చెబుతోంది. ఇక్కడ యాజమాన్యం గమనించాల్సిన విషయం ఏమిటంటే మీడియాలో వచ్చిన వార్తలు అబద్దాలు కాదు. ఆరోపణలు అసలే కాదు. వాస్తవ విరుద్దమైనవి అని దులిపేసుకుంటే సరిపోదు.’’సిఐడి’’ ద్వారా చేసిన విచారణ తర్వాత రూపొందించిన జాబితాలో ఆసుపత్రి పేరు అనుమానాస్పదంగా వుందని నింద ప్రభుత్వం మీద వేస్తున్నారా? లేక ‘‘సిఐడి’’ విచారణ లోప భూయిష్టంగా వుందని యాజమాన్యం భావిస్తుందా? అదే నిజమైతే యాజమాన్యం ప్రభుత్వం మీద కూడా దావా వేయవచ్చు. ‘‘సిఐడి’’కి కూడా నోటీసులు పంపవచ్చు. యాజమాన్యం ఆ దిశగా ముందుకు సాగుతుందా? స్పష్టం చేయాలి. ఎందుకంటే యాజమాన్యం నేరుగా ‘‘ప్రభుత్వాన్నే స్పష్టంగా దోషి’’ అంటోంది. అనుమానాస్పదంగా జాబితాలో ‘‘రోహిణి’’ పేరు వుందని చెప్పడం ‘‘రోహిణి’’ ఆసుపత్రి చేస్తున్న మరో నేరం. ‘‘సిఎంఆర్ఎఫ్’’ నిధుల అక్రమాల నేపథ్యంలో ‘‘రోహిణి’’ ఆసుపత్రి యాజమాన్యం, డాక్టర్లు, లేదా సిబ్బందికి ఎలాంటి సంబంధం లేదని చెప్పడమంటే ప్రభుత్వ పెద్దలు నిర్లక్ష్యంగా నిధులు విడుదల చేశారని సూటిగా ఆరోపణలు చేసినట్లు భావించాల్సి వుంటుంది. ప్రభుత్వం ‘‘సీఐడి’’ విచారణకు ఆదేశించినది నిజమే. కానీ ఇప్పటివరకు ఆ రిపోర్ట్ను అధికారికంగా విడుదల చేయలేదు అని ‘‘రోహిణి’’ ఆసుపత్రి వర్గాలు నిర్థారణకు వచ్చిందా? ఏ అధికారిక సమాచారం మేరకు ఈ విషయం స్పష్టం చేస్తున్నారో చెప్పాలి. ఇక ‘‘సిఐడి’’ నివేదిక అనేది పబ్లిక్ డొమైన్లో పెట్టేది కాదు.రహస్య విచారణలకు సంబంధించిన ఏ విషయాన్ని ప్రభుత్వం బహిర్గతం చేయదు.ఈ విషయం యాజమాన్యానికి తెలియకపోవడం విడ్డూరం.’’సిఐడి’’ నేరుగా తన నివేదికను బహిరంగ పర్చదు. ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుంది. ఆ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం ప్రత్యేకంగా జివో విడుదల చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన జివో కాపీలోనే ‘‘రోహిణి’’ ఆసుపత్రి పేరును చేర్చడం జరిగింది. ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో ‘‘రోహిణి’’ పేరు వుంది. ‘‘రోహిణి’’ ఆసుపత్రి పేరును అనుమానాస్పదంగా ‘‘సిఐడి’’ చేర్చిందనడం కూడా నేరంగా పరిగణిస్తారు. ‘‘రోహిణి’’ ఆసుపత్రి పేరుతో ఎవరో నకిలీ స్టాంపులు, బిల్లులు తయారు చేసినట్లు చెప్పి యాజమాన్యం తప్పించుకోవాలని చూసినా చెల్లదు. మరింత కఠినమైన శిక్ష బాధ్యులౌతారు. అంతేకాకుండా ‘‘సిఐడి’’ బోగస్ విచారణ చేపట్టిందని, ‘‘సిఐడి’’ విచారణ సరైన పద్ధతిలో జరగలేదని యాజమాన్యం సూటిగా ఆరోపణలు చేసినట్లౌతుంది. ఎవరు నకిలీ, ఏది నకిలి అని తేల్చలేనంత అసమర్థంగా ‘‘సిఐడి’’ విచారణ చేసిందని యాజమాన్యం ప్రతికా ప్రకటన ద్వారా స్పష్టం చేసినట్లైంది. దీనిని ‘‘సిఐడి’’ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం వుంది. ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఏకంగా ‘‘సిఐడి’’ వ్యవస్థనే శంకిస్తోంది. అంటే నేరుగా ప్రభుత్వానికే సవాలు విసిరింది. ‘‘సిఐడి’’ చేసిన విచారణ తప్పు అని ‘‘రోహిణి’’ ఆసుపత్రి అంటోంది.’’సిఐడి’’ వెంటనే స్పందించాల్సిన అవసరం వుంది. లేకుంటే ‘‘సిఐడి’’ వ్యవస్థకే మచ్చ వస్తుంది. ‘‘సిఐడి’’ నివేదికే బైటకు రాలేదంటున్న ‘‘రోహిణి’’ యాజమాన్యం నివేదికలో ‘‘సిఐడి’’ పొందుపర్చిన పేర్లు ఎలా తెలిసింది? ఆ పేషెంట్లు మా ఆసుపత్రిలో చికిత్స చేసుకోలేదని ఎలా చెబుతున్నారు? మీడియా వద్ద ‘‘సిఐడి’’ రిపోర్ట్ వుందా? అని యాజమాన్యం ప్రశ్నిస్తోంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘‘జివో’’ కూడా ‘‘బోగస్’’ అని యాజమాన్యం నిర్థారించినట్లేనా? ‘‘సిఐడి’’ రిపోర్ట్ లో వున్న పేర్లు యాజమాన్యానికి ఎలా తెలిశాయి. ‘‘సిఐడి’’ రోహిణి ఆసుపత్రి యాజమాన్యాన్ని విచారణకు పిలువలేదా?ఆసుపత్రికి వచ్చి విచారణ చేయలేదా? మా ఆసుపత్రి యాజమాన్యాన్ని సంప్రదించకుండానే ‘‘సిఐడి’’ రిపోర్ట్ తయారు చేసిందని ‘‘రోహిణి’’ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయా? ‘‘సిఐడి’’ రాలేదని నిర్థారిస్తున్నారా? అందుకు ఐదు రోజుల గడువు సిఐడికి ఇస్తున్నారా? రాష్ట్ర ప్రభుత్వానికి గడువు విధిస్తున్నారా? ఎందుకంటే మీడియాకు గడువు విధించే అధికారం రోహిణి యాజమాన్యానికి లేదు. ప్రభుత్వమే మీడియాకు ‘‘జీవో’’ తో పాటు జాబితాను ప్రచురణ కోసమే విడుదల చేశారు. అధికారికంగా విడుదల చేసిన జాబితాను అనుసరించే మీడియా తన కర్తవ్యాన్ని నిర్వర్తించింది. యాజమాన్యానికి నిజంగా ధైర్యం వుంటే ప్రభుత్వం విడుదల చేసిన జాబితా తప్పు అని ప్రకటన చేయాలి. మీడియా మీద తోసేసి చేతులు దులుపుకుంటామంటే సరిపోదు. ఇక ‘‘సీఎంఆర్ఎఫ్’’ నిధులు రోగుల ఖాతాలకు నేరుగా వెళ్లేలా వ్యవస్థ ఉంది. నిజమే…మరి ఈ ఆసుపత్రి పేరుతో నిధులు విడుదల జరుగుతుంటే ఇంత కాలం యాజమాన్యం ఏం చేసినట్లు? ‘‘సిఐడి’’ విచారణకు వచ్చినప్పుడు ఆ బిల్లులు మా ఆసుపత్రికి సంబంధం లేదని ఎందుకు చెప్పలేదు? చెబితే ‘‘సిఐడి’’ విచారణ ఆ దిశగానే జరిగేది. తెలంగాణలో ఇన్ని ఆసుపత్రులు వుండగా 28 ఆసుపత్రులు తప్పులు చేసినట్లు తేలింది? ఇక మీడియాను సవాలు చేసిన యాజమాన్యం కోర్టు ఉత్తర్వులు ఎందుకు పొందుపర్చలేదు? రోహిణి యాజమాన్యం ఈ విషయాలపై స్పష్టత ఇవ్వాలి.