జనగణనతో పాటు కులగణన

కేంద్ర రాజకీయ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ నిర్ణయం

`విపక్షాలను డిఫెన్స్‌లో పడేసిన బీజేపీ

`కులగణనపై విపక్ష దాడులకు చెక్‌ పెట్టేందుకే ఈ నిర్ణయం

`ఈ నిర్ణయంతో బిహార్‌లో ఎన్డీఏ కూటమికి గెలుపు అవకాశాలు మరింత మెరుగు

`బిహార్‌, కర్ణాటక, తెలంగాణల్లో కులగణన నిర్వహించిన ప్రభుత్వాలు

`రాజకీయ, సామాజిక ఒత్తిళ్ల ప్రభావం కులగణనపై వుండే అవకాశం

`జనాభాలెక్కలతో పాటే నిర్వహిస్తే కచ్చితమైన ఫలితాలు రాగలవు

`కులవ్యవస్థ మరింత బలపడే అవకాశం

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని రాజకీయ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీపీఏ) బుధవా రం సమావేశమై కులగణన విషయంలో అత్యంత కీలక నిర్ణయం తీసుకోవడం ద్వారా ఈ అంశాన్ని ఒక అస్త్రంగా మలచుకొని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న విపక్షాలకు గట్టి షాక్‌ ఇచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా త్వరలో బీహార్‌లో ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఈ కులగణన అంశాన్ని కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. ప్రస్తుతం ఏన్డీఏ కూటమికినేతృత్వం వహిస్తున్న జేడీయూ, గతంలో మహాఘట్‌బంధన్‌లో భాగస్వామిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో కులగణన చేసింది. ఈ గణన ప్రకారం రాష్ట్రంలో 75శాతం వెనుకబడిన వర్గాలున్నట్టు తేలింది. అయితే కులగణను బీజేపీ మొదటినుంచి వ్యతిరేకిస్తున్నది. కులాలుగా, వర్గాలుగా హిందువులను ముక్కలుగా చీల్చే ప్రక్రియగా దీన్ని పేర్కొంటూ వచ్చింది. బిహార్‌లో కులగణను ప్రధాన అస్త్రంగాచేసుకొని కాంగ్రెస్‌ తదితర విపక్షాలు ప్రచారం కొనసాగించడం భాజపాకు మింగుడు పడటం లేదు. ఎన్నికల వాతావరణం తమకే సానుకూలంగా వున్నాయన్న సంకేతాలు స్పష్టంగా వెలువడు తున్నప్పటికీ, తమకు ప్రతికూలంగా మారే ఏ చిన్న అంశాన్ని నిర్లక్ష్యం చేయకూడదన్న ఉద్దేశంతో, కులగణనపై తన అభిప్రాయాన్ని మార్చుకోవడం ద్వారా, విపక్షాలకు ముందరికాళ్లకు బంధం వేసేవిధంగా, జనాభాలెక్కలతో పాటు కులగణన కూడా చేపట్టడానికి నిర్ణయించింది. సీసీపీఏ తీసుకున్న నిర్ణయంతో బిహార్‌లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన జనతాదళ్‌ యునైటెడ్‌, రాష్ట్రీయ లోక్‌సమతాపార్టీ నాయకుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. ఇప్పటివరకు కాంగ్రెస్‌ సహా విపక్షాల దాడిని ఎదుర్కోవడంలో డిఫెన్స్‌లో పడిపోయిన ఈ పార్టీలు ఇప్పుడు, విపక్షాలపై తమ ప్రతిదాడులను మరింత తీవ్రం చేసేందుకు ముందడుగులు వేస్తున్నాయి.

వాయిదా పడుతున్న జనగణన

నిజానికి జనగణన 2020లో చేపట్టాల్సివుంది. కానీ కోవిడ్‌ మహమ్మారి కారణంగా వాయిదాపడిరది. రాజ్యాంగ నిర్దేశం ప్రకారం ప్రతి పదేళ్లకోమారు జనగణన చేపట్టాలి. దీని ప్రకారం 2021 నాటికి జనాభా లెక్కల వివరాలు ప్రచురితం కావాల్సి వుంది. కానీ అది ఇప్పటివరకు వాయి దా పడుతూ వచ్చింది. ఇదిలావుండగా కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ సామాజిక న్యా యం జరగాలంటే కులగణన తప్పనిసరని గతంలో గట్టిగా వాదిస్తున్నారు. ముఖ్యంగా వెనుకబడినవర్గాల వారు విద్యవిషయంలో ఇప్పటికీ అన్యాయానికి గురవుతున్నారనేది ఆయన ప్రధాన ఆరోపణ. అన్నివర్గాల ప్రజలకు వనరులను సమాన ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకువరావాలంటే కులగణన తప్పదని కాంగ్రెస్‌ గట్టిగా వాదిస్తోంది. 1927, మార్చి 20న డాక్టర్‌ బాబాసాహెబ్‌అంబేద్కర్‌ కులవివక్షను తీవ్రంగా విమర్శించారు. ఆరోజున నీటికోసం జరిపిన మహద్‌ సత్యాగ్ర హం సందర్భంగా మాట్లాడుతూ, ‘నీటికోసం మాత్రమేకాదు, గౌరవం, సమానత్వం కోసం జరిపేపోరాటం ఇది’ అంటూ పేర్కొన్న అంశం ప్రస్తావనార్హం. ఇదిలావుండగా భాజపా రాహుల్‌పై ఎ దురుదాడి చేస్తూ కుటుంబ పాలనలో కాంగ్రెస్‌ తమపార్టీకి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకుల ను ఎంతగా అవమానించిందో తెలుసుకోవాలని కోరింది. వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకులను పైకి ఎదగనీయకుండా తొక్కేసిన చరిత్ర కాంగ్రెస్‌దంటూ భాజపా ఆరోపిస్తూ వచ్చింది. అయితే కుల గణన ద్వారానే అసలు నిజాలు బయటకు వస్తాయని రాహుల్‌ గాంధీ కూడా ఎదురుదాడి చేయడం వర్తమాన రాజకీయ పరిణామం. 

కులగణన రాజకీయం

రాజకీయ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ నిర్ణయాలను విలేకర్లకు వివరిస్తూ కేంద్ర రైల్వేశాఖ మం త్రి అశ్విన్‌ వైష్ణవ్‌, కేవలం తమ రాజకీయ లబ్దికోసమే కులగణను ఇండీ కూటమి పార్టీలు లేవ నెత్తుతున్నాయని విమర్శించారు. కాగా రాజ్యాంగంలోని 246వ అధికరణలోని 69వ నిబంధన జనగణనను కేంద్ర ప్రభుత్వ బాధ్యతగా స్పష్టంగా పేర్కొంది. అయితే బిహార్‌, కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాలు దీన్ని పట్టించుకోకుండా కులగణన పూర్తిచేశాయి. అయితే ఇది కేవలం రాజ కీయ కోణంలోనే తమ ప్రయోజనార్థం చేపట్టిన కార్యక్రమమని, ఇందులో ఎటువంటి పారదర్శకత లేదని అశ్వనివైష్ణవ్‌ స్పష్టం చేస్తూ, కేంద్రం జనగణనతో పాటు చేపట్టే కులగణన ఎంతో పారదర్శకంగా, నిక్కచ్చిగా వుండబోతున్నదని స్పష్టం చేశారు. కొన్ని రాష్ట్రాలు కులగణన పేరుతో ని ర్వహించిన సర్వేలు సమాజంలో అనుమానాలు రేకెత్తించేవిగా వున్నాయని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే కులగణను, జనాభాలెక్కలతో పాటు చేపడితే స్పష్టమైన ఫలితాలు వస్తాయన్నారు. పదేళ్ల క్రితం సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కర్ణాటకలో కులగణన నిర్వహిం చింది. అయితే రాష్ట్రంలో బలమైన వర్గాలుగా వున్న వక్కళిగలు, లింగాయత్‌లనుంచి తీవ్ర వ్యతి రేకత రావడంతో ఆ నివేదికను ఇటీవలి కాలం వరకు ప్రభుత్వం బయటపెట్టడం సాధ్యంకాలే దు. బలీయమైన కులాల ప్రభావ తీవ్రతను ఇది మరోసారి బహిర్గతం చేసింది. ఈ కులగణనలో తమకు సరైన ప్రాతినిధ్యం లభించలేదని ఇప్పటికీ ఈ రెండు వర్గాలు తీవ్రంగా విమర్శిస్తున్నా యి కూడా. 

బిహార్‌లో తొలి కులగణన

కులగణన అవసరాన్ని నొక్కి చెబుతున్న విపక్ష పార్టీలు, దీనివల్ల ప్రతి కులంలో జనాభా సంఖ్య స్పష్టంగా తెలుస్తుంది కనుక దీని ఆధారంగా ఆయా వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు పరచ వచ్చునని వాదిస్తున్నాయి. కానీ ఓటు బ్యాంకు రాజకీయాలకోసం విపక్షాలు హిందూసమాజాన్ని ముక్కలుగా విడగొట్టి తమ పబ్బం గడుపుకోవాలని చూస్తునాయనేది భాజపా వాదన. అధికార,విపక్ష పార్టీల మాట ఎట్లా వున్నా, దేశంలో కులగణన జరిపిన మొట్టమొదటి రాష్ట్రం బిహార్‌. 2023లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో 36శాతం రాష్ట్రజనాభా అత్యంత వెనుకబడిన స్థా యిలో వున్నట్టు తేలింది. బిహార్‌ రాష్ట్రం మొత్తం జనాభా 13కోట్లలో 27.13% మంది ప్రజలు వెనుకబడిన వర్గాల కిందికి వస్తారు. 15.52% సాధారణ కేటగిరి ప్రజలుగా తేలింది. ఈ కులగణను రెండు దశల్లో నిర్వహించారు. మొదటి దశలో కుటుంబాల వారీగా జరపగా, రెండో దశలో సామాజిక, ఆర్థిక, కులపరంగా నిర్వహించారు. ఇప్పటికే కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ తమ పార్టీ అధికారంలోకి వస్తే, ఎస్సీ/ఎస్టీ/బీసీలకు ప్రస్తుతం విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో కల్పిస్తున్న రిజర్వేషన్‌ సదుపాయ పరిమితి 50%ని ఎత్తేస్తామని ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. 

ఇప్పటివరకు మూడు కులగణనలు

దేశంలో మొట్టమొదటి కులగణన 1871ా72లో నాటి బ్రిటిష్‌ వలసవాద ప్రభుత్వం చేపట్టింది. రెండో కులగణను 1931లో బ్రిటిష్‌ ప్రభుత్వం నిర్వహించింది. దాని తర్వాత 2011లో మాత్రమే కేంద్ర ప్రభుత్వం సామాజిక ఆర్థిక మరియు కులగణనను నిర్వహించింది. దీని ప్రకారం దే శంలో 46.7లక్షల కుల/ఉపకుల గ్రూపులున్నట్టు తేలింది. అయితే సేకరించిన సమాచారం స్థి రంగా లేకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. నిజానికి కులగణన వల్ల లాభనష్టాలు రెండూ వున్నాయి. ముందుగా ప్రయోజనాల విషయానికి వస్తే ఏఏ కులాల్లో ఎంతమంది జనాభా వున్నారనేది స్పష్టమవుతుంది. రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను జనాభా ఆధారంగా రూపకల్పన చేయవచ్చు. ఇదే సమయంలో పేదరికంలో మగ్గే వర్గాలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందుబాటులోకి తేవచ్చు. అంతేకాదు విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో ఆయా వర్గాల ప్రజలకు మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురావచ్చు. అయితే ఈ కులగణనలో కొన్ని ప్రతికూలతలు కూడా వున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అగ్రకులాలు, వెనుకబడిన కులాల పేర్లలో కొద్ది తేడా మాత్రమే కనిపిస్తుంది. ఉదాహరణకు ‘సెన్‌’ అనే కులం బెంగాల్‌లో అగ్రవర్ణం కాగా, ‘సెయిన్‌’ ఓబీసీ వర్గానికి చెందినది. చిన్న స్పెల్లింగ్‌ తప్పు జరిగినా పథకాల అమలు తారుమారు కావడం ఖాయం. బిహార్‌ కులగణనలో కొన్ని వివాదాలు చోటుచేసుకున్న సంగతిని గుర్తుంచుకోవాలి. బిహార్‌ కులగణనలో ఎన్యూమరేటర్లకు సరైన శిక్షణ ఇవ్వలేదని, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన జరగలేదన్న విమర్శలు వచ్చాయి. రాజకీయ, సామాజిక ఒత్తిళ్ల కారణంగా సమాచారాన్ని తారుమారుచేసే అవకాశాలు అధికమన్న విమర్శలు వచ్చాయి. సమాజంలో కులవ్యవస్థ మరింత కఠినంగా మారే ప్రమాదం ఏర్పడిరది. ఈ కులగణన నేపథ్యంలో, అధిక జనాభా కలిగిన కులాలవారు తమ నిష్పత్తికి అనుగుణంగ ప్రయోజనాలు కల్పించాలన్న డిమాండ్‌ చేయడం మొదలుపెట్టారు. ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలను కులాల ఆధారంగా అమలు చేయడమనేది ఒక ప్రామాణికతను సంతరించుకునే పరిస్థితి నెలకొంది. కులగణన చేపట్టేముందు ఇటువంటి ప్రతికూలతలను కూడా ప్రభుత్వాలు దృష్టిలో వుంచుకోవాలి. కాకపోతే ఈ కులగణన చేపట్టిన రాష్ట్రప్రభుత్వాల ముఖ్య ఉద్దేశం ప్రజల సంక్షేమం అనేదానికంటే, అధిక జనాభా కలిగిన వర్గాలకు ఎక్కువ రాయితీలు, సంక్షేమ పథకాలు అమలు చేయడం ద్వారా రాజకీయ లబ్దిపొందాలన్న ఉద్దేశం మాత్రమే కనిపిస్తోంది. ఎందుకంటే మనదేశంలో స్వాతంత్య్రానంతరం కాలక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు చిత్తశుద్ధి రాజకీయాలకు సమాధికట్టి, దానికి ఎప్పటికప్పుడు పాలరాతితో అద్భుతమైన ‘అవినీతి’ కళాఖండాలను జోడిస్తూ ప్రపంచపు వింతల్లో ఒకటిగా పరగణించే ‘తాజ్‌మహల్‌’ను తలదన్నే స్థాయిలో తీర్చిదిద్దాయి. దీనికి ఎప్పటికప్పుడు మరింత నగిషీల సొబగులు చేర్చడం తప్ప సంక్షేమం అమల్లో చిత్తశుద్ధి అనేదానికి ఎప్పుడో ‘తర్పణాలు’ వదిలేశాయి. ఒక్కపక్క కులరహిత సమాజం రావాలని సుద్దులు చెప్పే పార్టీలు తమ స్వార్థం కోసం కులవ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నాయి. నిజంగా పార్టీలకు చిత్తశుద్ధి వుంటే, సమాజంలో ‘ధనిక’, ‘పేద’ అనే రెండు వర్గాలనే గుర్తించి (కుల,మతాలకతీతంగా) పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేసినప్పుడు మాత్రమే అంబేద్కర్‌ ఆశయాలను సాధించినట్టుగా పరిగణించాలి. అంతేకాని స్వార్థం కోసం ఆ మహనీయుని పేరును ఉపయోగించుకోవడం అలవాటు కాకూడదు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!