రేవంత్ రెడ్డి నువ్వు రైతువా నకిలీ రైతువా
బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
హైదరాబాద్ లో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ఆరుగాలం కష్టపడి పనిచేసిన రైతులు పండించిన ధాన్యం అమ్ముకోలేకపోవడంలో వైఫల్యానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం. ప్రతి విషయంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది.
రైతులకు ప్రధానంగా కావాల్సిన గన్ని బ్యాగ్స్ సప్లై చేయడంలో మొదలుకోని దానికి కావలసినటువంటివి ఏర్పాటు చేసుకోవడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది.అసలు ప్రభుత్వానికి రైతులన్న, రైతు సమస్యలన్న ఆలోచన లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది.
ముఖ్యమంత్రి కి తిరగడానికి సమయం ఉంది కానీ,రైతులు పండించిన పంట కొనుగోలు పై ఆలోచన చేయడానికి సమయం లేదా..?
రేవంత్ రెడ్డి నువ్వు రైతు బిడ్డవి అని ఫోజులు కొడతావ్ కదా… అసలు నువ్వు రైతువా.. నకిలీ రైతువా…?
రైతులు మా తరుపున కొట్లాడాలి, మాకు న్యాయం చేకూరేలా కార్యాచరణ చేపట్టాలి అని మమ్మల్ని కోరుతున్నారు.
మక్కలు పండించిన రైతుల బాధ వర్ణనాతీతం.నా నియోజకవర్గం భూపాలపల్లిలో రైతులే గన్ని బ్యాగులు తెచ్చుకోవాలి, రైతులే 51.5 కిలోలు కాంట వేయాలి, వాహనాల్లో లోడింగ్ చేసుకోవాలి, అన్లోడింగ్ చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
నేడు దళారీ వ్యవస్థ పై మళ్ళీ రైతన్న ఆధారపడే వ్యవస్థ మొదలయింది.
ఒక్క భూపాలపల్లినే కాదు యావత్తు తెలంగాణ రాష్ట్రంలోని సెంటర్లన్ని కాంగ్రెస్ నాయకుల కన్నుసన్నల్లో, వారి డైరెక్షన్లో నడుస్తున్నాయి.
కాబట్టి ఇప్పటికైన ముఖ్యమంత్రి ఇప్పటి వరకు పంటలను ప్రభుత్వం కొన్నది అని పేపర్లలో పోజులు కొట్టడం కాదు, గాల్లో తిరుగుతూ చేతులు దులుపుకోవడం కాదు, ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది ఇప్పటివరకు కనీసం రాష్ట్రంలో రైతులు ధాన్యం ఎన్ని ఎకరాలలో వేశారు, ఎంత దిగువడి వచ్చింది, దానికి కావాల్సిన కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, గోదాంల ఏర్పాటు వంటి వాటిపై ఒక్కసారి అయిన సమీక్షా చేశారా…?
మేము వస్తే రైతురాజ్యం వస్తది అని ప్రజలను నమ్మించి మోసం చేసినవ్.
ప్రజలు నేడు చెప్తున్నారు ఈ రాష్ట్రంలో రైతులను మోసం చేసిన వ్యక్తి ఎవరూ అంటే రేవంత్ రెడ్డి… రైతు బాంధవుడు, రైతు రాజ్య స్థాపకుడు ఎవరూ అంటే అది కేసిఆర్ అని.
అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు ఈ రోజు మీకు అధికారం ఇచ్చిన పాపానికి రైతులు ఇబ్బంది పడుతున్నారు.
కేసీఆర్ చోరువతో రైతులు రెండు నుండి మూడు లక్షల ఎకరాలలో ఫామాయిల్ పంట వేయడం జరిగింది.
యూరియా యాప్ పెట్టిర్రు, ఆ యాప్ పనిచేయడం లేదు కాబట్టి వెంటనే యూరియా యాప్ ఓపెన్ చేసి ఆయిల్ఫామ్ పంట రైతులకు యూరియా పంపిణీ చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం.
కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర పెంచినట్టు ప్రకటించి ఒకపక్క డిజిల్ ధరలు మరొక పక్క రైతుల ఉపయోగించే కాంప్లెక్స్ ఎరువుల ధరలు కూడా పెంచడం జరిగింది.
ఇప్పటికైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపై అదనపు భారం పడకుండా, రైతులు ఇబ్బందులు పడకుండా రైతుల విషయంలో ఆలోచన చేయమని భారత రాష్ట్ర సమితి పార్టీ రైతుల తరుపున ప్రభుత్వాన్ని కోరారు.
